మార్చి 18 రాత్రి ప్రీమియర్ షోల అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ తదితర పనుల్లో బిజీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ బృందం టైం చాలా తక్కువగా ఉండటంతో ప్రమోషన్లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతోంది. సరే కంటెంట్ బాగుంటే పవన్ మూవీకి ఇవన్నీ అక్కర్లేదు కానీ ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే.
ప్రీమియర్లను ఎలా ప్లాన్ చేస్తారనేది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల హైక్ సులభంగా వచ్చేస్తుంది. అదేమీ సమస్య కాదు. కాకపోతే ధర ఎంత పెడతారనేది అసలు చిక్కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 600 రూపాయలు పెట్టినా ఇబ్బందయ్యేలా ఉంది. అఖండ తాండవం 2కి కొన్ని ఏరియాల్లో ఇదే సమస్యగా మారింది. ఓజి హైప్, బడ్జెట్ వేరు కాబట్టి దానికి వెయ్యి రూపాయలు పెట్టినా అభిమానులు లెక్క చేయలేదు.
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంత భీభత్సమైన బజ్ లేదు. మెల్లగా బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే సమయం ఎక్కువగా లేదు. అసలే దురంధర్ ది రివెంజ్ షోలను సాయంత్రం అయిదు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రభావం రాత్రి నుంచే మొదలవుతుంది. దానికి ధీటుగా ఉస్తాద్ టాక్ రావాలి. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఎలా చూపించాడనేది చాలా కీలకం కానుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే తొంభై రోజుల ముందు అనుమతి తీసుకుంటే బెనిఫిట్ షోలు, హైక్స్ కి పర్మిషన్ ఇవ్వమని కోర్టు ఇంతకు ముందే చెప్పింది. టెక్నికల్ గా ఇది పాటించడం ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల కాదు. దాని బదులు అనుమతి అవసరం లేని గరిష్ట ధర 295 రూపాయలు (మల్టీప్లెక్సులు) పెట్టేస్తే మంచి ఫలితం ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది. ఒకవేళ ఏపీలో జిఓ తీసుకున్నా ఒక వీకెండ్ కే పరిమితం చేయాలని, పదేసి రోజులు పెట్టడం వల్ల వసూళ్లు రావడం లేదని బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
వీలైనంత త్వరగా మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తే బెటర్. ఉగాది, రంజాన్ పండక్కు వస్తున్న స్టార్ హీరో స్ట్రెయిట్ మూవీ ఇదొక్కటే కావడంతో మరీ ఎక్కువ ఆశించకుండా డీసెంట్ ప్రైజింగ్ తో వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో అనాలసిస్ చేసుకోవాలి. ఒకపక్క దురంధర్ రివెంజ్ ప్రీమియర్ షోలు అంతకంత పెరుగుతూ పోతున్నాయి. ఉస్తాద్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు. అప్పటిదాకా టెన్షనే.
This post was last modified on March 8, 2026 1:13 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక…
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…