మార్చి 18 రాత్రి ప్రీమియర్ షోల అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ తదితర పనుల్లో బిజీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ బృందం టైం చాలా తక్కువగా ఉండటంతో ప్రమోషన్లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతోంది. సరే కంటెంట్ బాగుంటే పవన్ మూవీకి ఇవన్నీ అక్కర్లేదు కానీ ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే.
ప్రీమియర్లను ఎలా ప్లాన్ చేస్తారనేది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల హైక్ సులభంగా వచ్చేస్తుంది. అదేమీ సమస్య కాదు. కాకపోతే ధర ఎంత పెడతారనేది అసలు చిక్కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 600 రూపాయలు పెట్టినా ఇబ్బందయ్యేలా ఉంది. అఖండ తాండవం 2కి కొన్ని ఏరియాల్లో ఇదే సమస్యగా మారింది. ఓజి హైప్, బడ్జెట్ వేరు కాబట్టి దానికి వెయ్యి రూపాయలు పెట్టినా అభిమానులు లెక్క చేయలేదు.
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంత భీభత్సమైన బజ్ లేదు. మెల్లగా బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే సమయం ఎక్కువగా లేదు. అసలే దురంధర్ ది రివెంజ్ షోలను సాయంత్రం అయిదు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రభావం రాత్రి నుంచే మొదలవుతుంది. దానికి ధీటుగా ఉస్తాద్ టాక్ రావాలి. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఎలా చూపించాడనేది చాలా కీలకం కానుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే తొంభై రోజుల ముందు అనుమతి తీసుకుంటే బెనిఫిట్ షోలు, హైక్స్ కి పర్మిషన్ ఇవ్వమని కోర్టు ఇంతకు ముందే చెప్పింది. టెక్నికల్ గా ఇది పాటించడం ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల కాదు. దాని బదులు అనుమతి అవసరం లేని గరిష్ట ధర 295 రూపాయలు (మల్టీప్లెక్సులు) పెట్టేస్తే మంచి ఫలితం ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది. ఒకవేళ ఏపీలో జిఓ తీసుకున్నా ఒక వీకెండ్ కే పరిమితం చేయాలని, పదేసి రోజులు పెట్టడం వల్ల వసూళ్లు రావడం లేదని బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
వీలైనంత త్వరగా మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తే బెటర్. ఉగాది, రంజాన్ పండక్కు వస్తున్న స్టార్ హీరో స్ట్రెయిట్ మూవీ ఇదొక్కటే కావడంతో మరీ ఎక్కువ ఆశించకుండా డీసెంట్ ప్రైజింగ్ తో వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో అనాలసిస్ చేసుకోవాలి. ఒకపక్క దురంధర్ రివెంజ్ ప్రీమియర్ షోలు అంతకంత పెరుగుతూ పోతున్నాయి. ఉస్తాద్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు. అప్పటిదాకా టెన్షనే.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…