స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో స్పెషల్ లుక్లో కనిపిస్తున్నడు.. ఆ లుక్ బయట పడకుండా జాగ్రత్త వహిస్తుంటారు. నెలల తరబడి బయట కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ సైతం చాన్నాళ్లుగా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వలేదు. ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) కోసం స్పెషల్ లుక్లోకి మారిన నేపథ్యంలోనే అతను బయటికి రావట్లేదన్నది స్పష్టం.
ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ సందీప్ గుణ్ణం నిర్మాణంలో ‘మృత్యుంజయ్’ సినిమా రిలీజైనా.. తన అవసరం ఉన్నప్పటికీ వచ్చి ప్రమోట్ చేయలేదు. లుక్ రివీల్ అవుతుందన్న కారణంతోనే తారక్ ఈ సినిమా కోసం రాలేదని సందీప్ సైతం చెప్పాడు. ఐతే ఇప్పుడు తారక్ ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం బయటికి వచ్చాడు.
హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన కిమ్స్ హాస్పిటల్ కొత్త శాఖను బెంగళూరులో ప్రారంభించగా.. ఆ వేడుకలో తారక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని అభివాదం చేయడానికి తారక్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు.
గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్ను చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సూపర్ స్టైలిష్గా ఉన్న తారక్ లుక్ వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ లుక్ తాలూకు ఫొటోలు నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రంలో తారక్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. బయట ఇప్పుడు కనిపించిన లుక్.. మేకప్, గెటప్తో సినిమాలో ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ.. ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on March 8, 2026 1:43 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…