స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో స్పెషల్ లుక్లో కనిపిస్తున్నడు.. ఆ లుక్ బయట పడకుండా జాగ్రత్త వహిస్తుంటారు. నెలల తరబడి బయట కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ సైతం చాన్నాళ్లుగా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వలేదు. ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) కోసం స్పెషల్ లుక్లోకి మారిన నేపథ్యంలోనే అతను బయటికి రావట్లేదన్నది స్పష్టం.
ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ సందీప్ గుణ్ణం నిర్మాణంలో ‘మృత్యుంజయ్’ సినిమా రిలీజైనా.. తన అవసరం ఉన్నప్పటికీ వచ్చి ప్రమోట్ చేయలేదు. లుక్ రివీల్ అవుతుందన్న కారణంతోనే తారక్ ఈ సినిమా కోసం రాలేదని సందీప్ సైతం చెప్పాడు. ఐతే ఇప్పుడు తారక్ ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం బయటికి వచ్చాడు.
హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన కిమ్స్ హాస్పిటల్ కొత్త శాఖను బెంగళూరులో ప్రారంభించగా.. ఆ వేడుకలో తారక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని అభివాదం చేయడానికి తారక్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు.
గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్ను చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సూపర్ స్టైలిష్గా ఉన్న తారక్ లుక్ వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ లుక్ తాలూకు ఫొటోలు నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రంలో తారక్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. బయట ఇప్పుడు కనిపించిన లుక్.. మేకప్, గెటప్తో సినిమాలో ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ.. ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on March 8, 2026 1:43 pm
కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే…
కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను…
దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత…
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం…
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం…