ఒకప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన కథానాయిక కాజల్ అగర్వాల్. తనతో పాటు అనుష్క శెట్టి, తమన్నా, సమంత లాంటి అగ్ర కథానాయికలు ఉన్నా.. తమిళం నుంచి త్రిష, నయనతార లాంటి వాళ్ల నుంచి పోటీ ఉన్నా.. తట్టుకుని టాప్లో కొనసాగింది కాజల్. తెలుగులో మాత్రమే కాక.. తమిళంలోనూ ఆమె టాప్ స్టార్లతో సినిమాలు చేసింది. హిందీలోనూ అడపాదడపా కొన్ని పెద్ద చిత్రాల్లో నటించింది. ఐతే హీరోయిన్ల కెరీర్ మరీ సుదీర్ఘంగా ఉండదన్న సంగతి తెలిసిందే.
ఉన్నంతలో బాగానే కెరీర్ను పొడిగించుకోగలిగిన కాజల్కు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినా సరే.. కాజల్ను ఆరాధించే అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆమెను వాళ్లందరూ ఉన్నత స్థాయిలోనే చూడాలనుకుంటారు. అలాంటి వాళ్లను నిరాశపరుస్తూ ఒక ఈవెంట్లో పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాజల్ అగర్వాల్ తాజాగా ఒక మండీ హోటల్ ఓపెనింగ్కు వెళ్లింది. దానికి సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఉప్పల్ బాలు సైతం గెస్ట్గా వచ్చాడు. అతడితో కలిసి కాజల్ ఒక రీల్ చేసింది. అందులో బాలు ఏం చెబుతుంటే అది చేసింది కాజల్.
ఆమెను కలవడం గురించి ఎగ్జైట్ అవుతూ ఉప్పల్ బాలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. కాజల్ రేంజ్ ఏంటి.. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడమేంటి.. వ్యూస్ కోసం వెంపర్లాడే బాలు లాంటి వాళ్లను ఎంగేజ్ చేస్తూ వీడియో చేయడం ఏంటి అని చందమామ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు.
ఈ వీడియోలో కాజల్ లుక్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఒక సాధారణ అమ్మాయిలా కనిపించింది. దీంతో ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీకి ఏమైంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాజల్కు ఇప్పుడు అవకాశాలు తగ్గి ఉండొచ్చు కానీ.. తన రేంజ్ వేరని.. ఆ స్థాయిని మెయింటైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ను ఆమె ఎంతమేర తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on March 6, 2026 10:20 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…