ఒకప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన కథానాయిక కాజల్ అగర్వాల్. తనతో పాటు అనుష్క శెట్టి, తమన్నా, సమంత లాంటి అగ్ర కథానాయికలు ఉన్నా.. తమిళం నుంచి త్రిష, నయనతార లాంటి వాళ్ల నుంచి పోటీ ఉన్నా.. తట్టుకుని టాప్లో కొనసాగింది కాజల్. తెలుగులో మాత్రమే కాక.. తమిళంలోనూ ఆమె టాప్ స్టార్లతో సినిమాలు చేసింది. హిందీలోనూ అడపాదడపా కొన్ని పెద్ద చిత్రాల్లో నటించింది. ఐతే హీరోయిన్ల కెరీర్ మరీ సుదీర్ఘంగా ఉండదన్న సంగతి తెలిసిందే.
ఉన్నంతలో బాగానే కెరీర్ను పొడిగించుకోగలిగిన కాజల్కు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినా సరే.. కాజల్ను ఆరాధించే అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆమెను వాళ్లందరూ ఉన్నత స్థాయిలోనే చూడాలనుకుంటారు. అలాంటి వాళ్లను నిరాశపరుస్తూ ఒక ఈవెంట్లో పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాజల్ అగర్వాల్ తాజాగా ఒక మండీ హోటల్ ఓపెనింగ్కు వెళ్లింది. దానికి సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఉప్పల్ బాలు సైతం గెస్ట్గా వచ్చాడు. అతడితో కలిసి కాజల్ ఒక రీల్ చేసింది. అందులో బాలు ఏం చెబుతుంటే అది చేసింది కాజల్.
ఆమెను కలవడం గురించి ఎగ్జైట్ అవుతూ ఉప్పల్ బాలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. కాజల్ రేంజ్ ఏంటి.. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడమేంటి.. వ్యూస్ కోసం వెంపర్లాడే బాలు లాంటి వాళ్లను ఎంగేజ్ చేస్తూ వీడియో చేయడం ఏంటి అని చందమామ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు.
ఈ వీడియోలో కాజల్ లుక్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఒక సాధారణ అమ్మాయిలా కనిపించింది. దీంతో ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీకి ఏమైంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాజల్కు ఇప్పుడు అవకాశాలు తగ్గి ఉండొచ్చు కానీ.. తన రేంజ్ వేరని.. ఆ స్థాయిని మెయింటైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ను ఆమె ఎంతమేర తీసుకుంటుందో చూడాలి.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…