ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి కూడా ఇలాంటి టాకే వస్తే యూనిట్ ఖండించే దాకా వెళ్ళింది పరిస్థితి. ఎడిటింగ్ టేబుల్ పక్కనే ఉండి తాము చూసినట్టు కొందరు న్యూస్ పుట్టిస్తున్న తీరు మహా విచిత్రంగా ఉంది.
టాక్సిక్ ని కూడా ఇది వదల్లేదు. 2 గంటల 50 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల దాకా లెన్త్ ఉంటుందనే తరహాలో రకరకాల లీకులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చెప్పిన వాటన్నింటిలో నిజానిజాలు సదరు యూనిట్లు అఫీషియల్ గా చెప్తే తప్ప క్లారిటీ రాదు. ఇవి హాట్ టాపిక్ గా మారడానికి కారణాలు లేకపోలేదు. జనవరి సంక్రాంతి హడావిడి అయిపోయాక చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో అందరి దృష్టి వీటిమీదే ఉంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మూవీ లవర్స్ లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతోంది.
ఎంత నిడివి ఉంటుందితో మొదలుపెట్టి క్లైమాక్స్ ఎంత ఖర్చు పెట్టి తీశారనే దాకా ప్రతిఒక్క అంశం మీద ఆసక్తి చూపిస్తున్నారు. రెండున్నర గంటలు థియేటర్లో కూర్చువడమే ఇప్పటి జనరేషన్ కు గొప్ప అనే భ్రమను సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, ఆదిత్య ధార్ లాంటి దర్శకులు బద్దలు కొట్టారు. కంటెంట్ ఉంటే జనం ఎంతసేపైనా ఉంటారని ఋజువు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ గురించి ఈ మాత్రం హైప్ ఉండటం సహజం.
అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి డైరెక్టర్లు ఏ విషయంలోనూ కాంప్రోమైజ్ కావడం లేదు. ఖర్చు అయినా లెన్త్ అయినా తాము బలంగా నమ్మితే రాజీ సమస్యే లేదంటున్నారు. దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంటున్నారు. అలాని అందరికీ ఇది జరగడం లేదు. కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో ఆడుతుందని బెంగాల్ ఫైల్స్ ని మూడున్నర గంటలు తీస్తే హిందీలో మూడు రోజులు కూడా నిలబడలేదు. ఆ కన్విన్సింగ్ టాలెంట్ అందరికీ ఉండదు. అందుకే మనోళ్లు ప్రత్యేక ముద్ర వేసి నార్త్ నుంచి సౌత్ దాకా అశేష అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
This post was last modified on March 3, 2026 7:14 pm
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి…
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…
స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు…
ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే.…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…