ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి కూడా ఇలాంటి టాకే వస్తే యూనిట్ ఖండించే దాకా వెళ్ళింది పరిస్థితి. ఎడిటింగ్ టేబుల్ పక్కనే ఉండి తాము చూసినట్టు కొందరు న్యూస్ పుట్టిస్తున్న తీరు మహా విచిత్రంగా ఉంది.
టాక్సిక్ ని కూడా ఇది వదల్లేదు. 2 గంటల 50 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల దాకా లెన్త్ ఉంటుందనే తరహాలో రకరకాల లీకులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చెప్పిన వాటన్నింటిలో నిజానిజాలు సదరు యూనిట్లు అఫీషియల్ గా చెప్తే తప్ప క్లారిటీ రాదు. ఇవి హాట్ టాపిక్ గా మారడానికి కారణాలు లేకపోలేదు. జనవరి సంక్రాంతి హడావిడి అయిపోయాక చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో అందరి దృష్టి వీటిమీదే ఉంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మూవీ లవర్స్ లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతోంది.
ఎంత నిడివి ఉంటుందితో మొదలుపెట్టి క్లైమాక్స్ ఎంత ఖర్చు పెట్టి తీశారనే దాకా ప్రతిఒక్క అంశం మీద ఆసక్తి చూపిస్తున్నారు. రెండున్నర గంటలు థియేటర్లో కూర్చువడమే ఇప్పటి జనరేషన్ కు గొప్ప అనే భ్రమను సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, ఆదిత్య ధార్ లాంటి దర్శకులు బద్దలు కొట్టారు. కంటెంట్ ఉంటే జనం ఎంతసేపైనా ఉంటారని ఋజువు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ గురించి ఈ మాత్రం హైప్ ఉండటం సహజం.
అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి డైరెక్టర్లు ఏ విషయంలోనూ కాంప్రోమైజ్ కావడం లేదు. ఖర్చు అయినా లెన్త్ అయినా తాము బలంగా నమ్మితే రాజీ సమస్యే లేదంటున్నారు. దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంటున్నారు. అలాని అందరికీ ఇది జరగడం లేదు. కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో ఆడుతుందని బెంగాల్ ఫైల్స్ ని మూడున్నర గంటలు తీస్తే హిందీలో మూడు రోజులు కూడా నిలబడలేదు. ఆ కన్విన్సింగ్ టాలెంట్ అందరికీ ఉండదు. అందుకే మనోళ్లు ప్రత్యేక ముద్ర వేసి నార్త్ నుంచి సౌత్ దాకా అశేష అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…