Political News

`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. అమెరికా సైనిక స్థావ‌రాలు ఉన్న గల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెత‌న్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. ఈ యుద్ధం కొన‌సాగుతుంద‌ని.. మ‌రింత భీక‌రంగా మారుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. వారం ప‌ది రోజులు సాగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అంతేకాదు.. అమెరికా సైనికులు మ‌రింత మంది త‌మ ప్రాణాల‌ను త్యాగం చేయాల్సి ఉంటుంద‌ని కూడా ట్రంప్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇదిలావుంటే.. ప్ర‌పంచ దేశాల్లో ఎక్క‌డా యుద్ధాన్ని అభిల‌షించేది లేద‌న్న భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్దం అయినా.. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధ‌మైనా.. ఖండించారు. త‌ట‌స్థంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఒక ద‌శ‌లో ఉక్రెయిన్‌-ర‌ష్యాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్తం చేసేందుకు కూడా మోడీ ముందుకు వ‌చ్చారు. ర‌ష్యా అధ్య‌క్షుడిని కూడాదేశానికి పిలిచి చ‌ర్చించారు. కానీ.. తాజాగా ప‌శ్చిమాసియా విష‌యానికి వ‌స్తే.. ఒకింత భిన్న‌మైన మార్గంలో మోడీ అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా తెర‌మీదికి వ‌చ్చింది. జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి.

దీనికి కార‌ణం.. ఆది నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడి స‌రికాద‌న్న వాద‌న నుంచి ఇప్పుడు ఏక‌ప‌క్షం దిశ‌గా మోడీ అడుగులు ప‌డుతున్నాయి. తాజాగా గ‌ల్ఫ్ దేశాల అధినేత‌ల‌తో ప్ర‌ధాని వ‌రుసగా ఫోన్లు మాట్లాడారు. ఆయా దేశాల‌కు భ‌రోసా ఇచ్చారు. బెహ్రెయిన్‌, సౌదీ అరేబియా దేశాల‌పై ఇరాన్ చేసిన దాడుల‌ను ప్ర‌ధాన మంత్రి ఖండించారు. ఈ దాడులు స‌రికావ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెతన్యాహూతోనూ ప్ర‌ధాన మంత్రి ఫోన్‌లో సంభాషించా రు. ఆయ‌న క్షేమ స‌మాచారాలు తెలుసుకున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు యుద్ధం జ‌రుగుతున్న దేశాల‌తో భార‌త్ అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించింది. నేరుగా వారికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం.. క్షేమ స‌మాచారాలు తెలుసుకోవ‌డం వంటివి లేదు. కానీ.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి జోక్యం చేసుకోవ‌డం.. ఇరాన్‌ను వ‌దిలేసి.. ఇత‌ర దేశాల‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. దేశ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంద‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీని వెనుక అమెరికా ఒత్తిడి ఉండి ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు అప్పుడే విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నాయి. ఏదేమైనా.. శాంతి మంత్రం ప‌ఠించే దేశం.. ఇప్పుడు కొన్ని దేశాల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం. 

Kumar

Recent Posts

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

7 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

40 minutes ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

1 hour ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

2 hours ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago