ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి తగ్గకపోగా.. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ యుద్ధం కొనసాగుతుందని.. మరింత భీకరంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారం పది రోజులు సాగే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాదు.. అమెరికా సైనికులు మరింత మంది తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి ఉంటుందని కూడా ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ఇదిలావుంటే.. ప్రపంచ దేశాల్లో ఎక్కడా యుద్ధాన్ని అభిలషించేది లేదన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం అయినా.. ఇజ్రాయెల్-గాజా యుద్ధమైనా.. ఖండించారు. తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక దశలో ఉక్రెయిన్-రష్యాల మధ్య మధ్యవర్తిత్తం చేసేందుకు కూడా మోడీ ముందుకు వచ్చారు. రష్యా అధ్యక్షుడిని కూడాదేశానికి పిలిచి చర్చించారు. కానీ.. తాజాగా పశ్చిమాసియా విషయానికి వస్తే.. ఒకింత భిన్నమైన మార్గంలో మోడీ అడుగులు వేస్తున్నారన్న చర్చ జోరుగా తెరమీదికి వచ్చింది. జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా వస్తున్నాయి.
దీనికి కారణం.. ఆది నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడి సరికాదన్న వాదన నుంచి ఇప్పుడు ఏకపక్షం దిశగా మోడీ అడుగులు పడుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాని వరుసగా ఫోన్లు మాట్లాడారు. ఆయా దేశాలకు భరోసా ఇచ్చారు. బెహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలపై ఇరాన్ చేసిన దాడులను ప్రధాన మంత్రి ఖండించారు. ఈ దాడులు సరికావని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూతోనూ ప్రధాన మంత్రి ఫోన్లో సంభాషించా రు. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతున్న దేశాలతో భారత్ అంటీముట్టనట్టే వ్యవహరించింది. నేరుగా వారికి మద్దతు పలకడం.. క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వంటివి లేదు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవడం.. ఇరాన్ను వదిలేసి.. ఇతర దేశాలకు మద్దతుగా వ్యవహరించడం.. దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోందని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీని వెనుక అమెరికా ఒత్తిడి ఉండి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అప్పుడే విమర్శలు కూడా చేస్తున్నాయి. ఏదేమైనా.. శాంతి మంత్రం పఠించే దేశం.. ఇప్పుడు కొన్ని దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
This post was last modified on March 3, 2026 7:34 pm
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…
స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు…
ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే.…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు…