ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు ఆడే కాలం కాదిది. ఓటిటిలోనూ అంతే. ఎంత బ్లాక్ బస్టర్ అయినా వ్యూస్ మొత్తం మొదటి వారంలోనే వచ్చేయాలి. తర్వాత పెద్దగా చూసేవాళ్ళు ఉండరు. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. కానీ కార్తీ టీమ్ ఈ సూత్రాన్ని విస్మరించింది. జనవరిలో సంక్రాంతికి విడుదలైన వా వతియర్ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ జరుపుకోని సంగతి తెలిసిందే.
తమిళంలో డిజాస్టర్ కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రధాన బాషల వెర్షన్లు అందుబాటులోకి తెచ్చారు. ఆ టైంలోనే డబ్బింగ్ మీద విమర్శలు వచ్చాయి. సినిమాలో ఉన్న కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఎంజిఆర్ రెఫరెన్సులు ఏ మాత్రం మార్చకుండా డైలాగుల్లో మాత్రమే ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి ఖంగాళీ చేయడం పట్ల భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లాప్ మూవీ కాబట్టి జనం పెద్దగా పట్టించుకోలేదు. మాములుగా ఇలాంటి విషయాల్లో కార్తీ శ్రద్ధ తీసుకుంటాడు. కానీ ఫలితం వల్లేమో పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నగారు వస్తారు అసలు వెర్షన్ ని అందుబాటులోకి తెస్తున్నారు. అంటే ఎంజిఆర్ ఫోటోలు, వీడియోల స్థానంలో మన స్వర్గీయ ఎన్టీఆర్ ని చూడబోతున్నాం అన్న మాట. ఈ పనేదో అప్పుడే చేసి ఉంటే కామెంట్స్ వచ్చేవి కాదు. అసలే టైటిల్స్ తో సహా తమిళ పేర్లు యధావిధిగా పెడుతున్నారనే నెగటివిటీ ఈ మధ్య డబ్బింగ్ సినిమాల విషయంలో బాగా పెరిగిపోయింది.
కానీ వా వతియర్ అన్నగారు వస్తారుగా మార్చి మంచి పని చేసిన నిర్మాత తీరా మెయిన్ మూవీలో ఎంజిఆర్ ని అలాగే ఉంచడం అస్సలు బాలేదు. ఎక్కాల్సిన రైలు జీవితం కాలం లేటు అన్నట్టు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడీ కారణంగా హఠాత్తుగా వ్యూస్ పెరగడం జరగవు కానీ ఇకపై మాత్రం ఇలాంటి విషయాల్లో ప్రొడ్యూసర్లు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలా చేస్తే లేటుగా నిద్ర లేచే అవసరం ఉండదు. మళ్ళీ కొత్తగా మాటలు పడే అవసరం అసలే రాదు. ఈ మాత్రం చేయడం కూడా మంచిదే.
This post was last modified on March 3, 2026 10:37 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…