వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది. మొన్నటిదాకా జోరుగా ప్రమోషన్లు చేసిన టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. పోస్ట్ పోన్ అనుకునే మౌనం వహించినట్టు ఉన్నారు. అయితే అదే రోజు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాసలు ఉన్నాయి. కంటెంట్ పరంగా చూసుకుంటే ఆ రెండు పెద్ద స్కేల్ తో రూపొందాయి. జానర్లు కూడా వేరే. బ్యాండ్ మేళం అలా కాదు.. గతంలో చూసిందే.
ఒక టీనేజ్ అమ్మాయి అబ్బాయి మధ్య రూపొందిన విలేజ్ లవ్ స్టోరీ. పూర్తి వినోదాత్మకంగా తీశారు. నిర్మాత కోన వెంకట్ దగ్గరుండి పబ్లిసిటీ వ్యవహారాలు గట్రా చూసుకుంటున్నారు. నిర్ణయం మార్చుకోవడానికి గల కారణాలు వేరే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ చాలా అంటే చాలా డ్రైగా ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు. చాలా సినిమాలకు బయట పోస్టర్లు ఉంటున్నాయి కానీ లోపల షోలు పడటం లేదు.
పట్టుమని పదిమంది కూడా రాకపోతే ఎగ్జిబిటర్లు మాత్రం ఏం చేయగలరు. కపుల్ ఫ్రెండ్లీ లాంటి డీసెంట్ టాక్ వచ్చినవి కూడా ఏ సెంటర్లలోనే వసూళ్లు తెచ్చాయి. ఇవి కాసేపు పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పిల్లలు పరీక్షల మూడ్ లో ఉన్నారు. బ్యాండ్ మేళంకు మద్దతు ఇవ్వాల్సింది వాళ్ళే. ఇప్పుడు అదే పనిగా చదువులు పక్కన పెట్టి వచ్చే సీన్ లేదు. అందుకే టీమ్ వెనుకడుగు వేసి ఉండొచ్చు.
పైగా మార్చి 19 దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ సునామిలాగా ముంచుకొస్తున్నాయి. బ్యాండ్ మేళంకు మంచి టాక్ వచ్చినా థియేటర్లను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఉన్నది కేవలం వారం గ్యాపే. ఆడియన్స్ వాటి కోసం ఎదురు చూసే మూడ్ లో వేరేవాటిని పట్టించుకోవడం లేదు.
ఏది ఏమైనా థియేటర్ల దగ్గర పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేరళ స్టోరీ 2 లాంటి హిందీ సినిమాలు ఏమైనా ఆక్సీజెన్ ఇస్తాయేమో అనుకుంటే అది కూడా జరగడం లేదు. మృత్యుంజయ్ నుంచి ఈ నిర్లిప్తతలో మార్పు రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. మరి బైకర్, రాకాసతో ఢీ కొట్టడం బాగానే ఉంది కానీ ఇది రిస్కో కాదో ఏప్రిల్ 3 కంటెంట్ చూశాక అర్థమవుతుంది.
This post was last modified on March 3, 2026 7:08 pm
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం..…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…