టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు బిరియాని అంటే ఎంత ప్రేమో చాలా సందర్భాల్లో చెప్పాడు తారక్. అలాగే అతడికి చాలా ఇష్టమైన చిరు తిళ్లలో పునుగులు కూడా ఒకటి. వాటిని ఎంత ఇష్టంగా తింటానో తారక్ బయట పెట్టాడు. ఇక తాను బాగా తినడమే కాక.. అందరికీ మంచి ఫుడ్ పెడతాడని పేరున్న ప్రభాస్ సైతం పునుగులను చాలా ఇష్టపడతాడట.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ని ప్రమోట్ చేయడం కోసం ఆ టీంతో కలిసి ఒక చిట్ చాట్ వీడియో చేసిన ప్రభాస్.. అందులో తన పునుగుల ప్రేమ గురించి వెల్లడించాడు ప్రభాస్. ప్రతి ఊరూ ఒక స్పెషల్ ఫుడ్కు ఫేమస్ అయి ఉంటుందని.. అలా విజయవాడ పునుగులకు ఫేమస్ అని ప్రభాస్ అన్నాడు. తనకు చిన్నతనం నుంచి విజయవాడలో పునుగులు చాలా ఇష్టమని అతను వెల్లడించాడు.
తన క్లోజ్ ఫ్రెండ్ అయిన యువి క్రియేషన్స్ అధినేత ప్రమోద్తో కలిసి తాను పునుగులను భలేగా ఎంజాయ్ చేసేవాడినని చెప్పాడు. ప్రమోద్ తండ్రి సాయంత్రాల్లో తనను, ప్రమోద్ను తన వెస్పా స్కూటర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లి ఆ పునుగులు తినిపించేవాడని ప్రభాస్ చెప్పాడు. పునుగులు చాలా చోట్ల ఉండొచ్చని.. కానీ విజయవాడలో చిన్న చిన్నగా చేస్తారని.. ప్లేట్లో వాటి మీద చట్నీ వేసి ఇస్తారని.. ఆ టేస్టే వేరని ప్రభాస్ అన్నాడు. ఇలా చెబుతూ చెబుతూ.. ఇప్పుడు తనకు నోటిలో నీళ్లు ఊరిపోతున్నాయని.. పునుగులు తినాలని అనిపిస్తోందని ప్రభాస్ చెప్పడం విశేషం.
హైదరాబాద్లో ఉన్నా సరే.. తనకు విజయవాడలో వెళ్లి పునుగులు తినాలనిపిస్తుందని.. షూటింగ్ల కోసం కార్లో వెళ్తూ ఉన్నపుడు అక్కడ ఆగి తినాలని అనుకుంటానని ప్రభాస్ చెప్పాడు. ఐతే చాలా వరకు తాను రాత్రిళ్లే ప్రయాణాలు చేస్తా కాబట్టి.. తాను విజయవాడకు వెళ్లే సమయానికి అక్కడ పునుగులు ఉండవని ప్రభాస్ ఒకింత బాధగా చెప్పుకుంది.
This post was last modified on February 20, 2026 3:55 pm
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…
నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్గా అందరికీ సుపరిచితమే.…