తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఈసారి వేలంటైన్స్ డేకి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ధనుష్తో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలన్నీ అబద్ధమని.. తమ పెళ్లి అని నమ్మిన వాళ్లందరూ వేలంటైన్స్ డేకి ఫూల్స్ డే చూస్తారని ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది మృణాల్.
ఐతే ధనుష్తో రిలేషన్షిప్ ఏమీ లేదని తేల్చేసింది కానీ.. అతడి మీద ఒక ఇంటర్వ్యూలో ప్రశంసల జల్లు కురిపించింది మృణాల్. తాను ధనుష్కు చాలా పెద్ద ఫ్యాన్ అని ఆమె వెల్లడించింది. తన పెర్ఫామెన్స్లు చూసి ఫిదా అయిపోయానని ఆమె పేర్కొంది.
‘‘ధనుష్ నటనలో ఒక ఇన్స్టిట్యూషన్ లాంటి వ్యక్తి. ఆయన కేవలం గొప్ప నటుడే కాదు.. మంచి సింగర్, సూపర్ డ్యాన్సర్, ఇంకా పాటలు కూడా రాయగలరు. అన్నింటికీ మించి డైరెక్టర్ కూడా. ఆయన చేయనిది ఏముంది? రాయన్, రాన్జానా, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలు చూసి ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా.
అసురన్ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ధనుష్ సార్తో కలిసి సినిమాలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ధనుష్ సార్ ముంబయిలో ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో నటిస్తున్నపుడు.. నేనే నా సినిమా ‘సన్నాఫ్ సర్దార్-2’ ప్రిమియర్కు ఆహ్వానించా. ఆయన వస్తారో లేదో అనుకున్నా. రావడంతో చాలా సంతోషించా. ఆయన నాకు మంచి ఫ్రెండ్’’ అని మృణాల్ పేర్కొంది.
ఐతే ధనుష్కు తనకు మధ్య ఏమీ లేదని చెబుతున్నా.. ఇప్పటిదాకా కలిసి నటించని ఈ ఇద్దరూ ఇంత క్లోజ్ ఎలా అయ్యారన్నదే చాలామందికి సందేహం. మృణాల్ ఠాకూర్ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.
This post was last modified on February 20, 2026 3:00 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…