కొన్నేళ్ల ముందు తమిళ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్.. షూటింగ్ మొదలైన రోజు గైర్హాజరు కావడమే కాక, ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద పెద్ద వివాదమే నడిచింది. అర్జున్ హైదరాబాద్కు వచ్చి మరీ ఈ విషయమ్మీద ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశాడు.
ఎప్పుడూ కూల్గా ఉండే అర్జున్.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అలా మాట్లాడాడంటే ఏదో పెద్ద విభేదమే ఏర్పడిందని అందరికీ అర్థమైంది. ఐతే తాను ఏ స్థితిలో ఆ సినిమా నుంచి బయటికి రావాల్సి వచ్చిందో విశ్వక్ వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అర్జున్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అనుకున్నారు.. కానీ కొంచెం గ్యాప్ తర్వాత పట్టాలెక్కించాడు. అదే.. సీతాపయనం.
విశ్వక్తో చేయించాలనుకున్న పాత్రకు నిరంజన్ అనే కొత్త కన్నడ నటుడిని తీసుకున్నాడు అర్జున్. ఈ సినిమా వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది.
విశేషం ఏంటంటే.. విశ్వక్ కొత్త సినిమా ఫంకీ సైతం ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విశ్వక్ సినిమా, విశ్వక్ వదిలేసుకున్న సినిమా బాక్పాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడబోతున్నాయన్నమాట. ఐతే ఇప్పటికీ విశ్వక్ మీద అర్జున్కు కోపం ఉందా అన్నది ఆసక్తికరం. కానీ అదేమీ లేదంటూ ఒక ఇంటర్వ్యూలో పాజిటివ్ కామెంట్స్ చేశాడు అర్జున్.
ఈ గొడవ విషయంలో ఏం జరిగింది అని అడిగితే.. ‘‘అప్పుడు ఏం జరిగింది అంటే అదొక చరిత్ర. కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల కొన్ని విషయాలు జరగవు. మళ్లీ వాటిని తవ్వుకుని లాభం లేదు. నేను మళ్లీ గతంలోకి వెళ్లను. గతం గత: అనుకుని ముందుకు వెళ్లిపోతుంటా. లేకపోతే మనం ముందడుగు వేయడం కష్టమైపోతుంది.
అందుకే వదిలేసి వెళ్లిపోవాం. అందరూ బాగుండాలి. విశ్వక్సేన్ చిన్న కుర్రాడు. వాళ్లూ బాగుండాలి. వాళ్ల సినిమా సినిమా కూడా ఇప్పుడే రిలీజవుతోంది. అది కూడా బాగా ఆడాలి’’ అంటూ విశ్వక్కు శుభాకాంక్షలు చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు అర్జున్.
This post was last modified on February 8, 2026 4:27 pm
“భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశం. ఇతర దేశాలకు తలవొంచదు. ఎవరో చెప్పినట్టు కూడా నడుచుకోదు. ఎవరి ఆదేశాలనో పాటించాల్సిన…
వచ్చే 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్న విషయం…
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా?…
సోషల్ మీడియా యావలో పడిన చాలా మంది యువకులు, యవతులు తమ ప్రాణాలను కూడా బలి చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఇలాంటి…
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి..…