ఒక నటుడు సినిమా నుంచి ఒక పారితోషకం ఆశిస్తాడు. టీం అనుకున్న దాని కంటే మూడు రెట్లకు పైగా రెమ్యూనరేషణ్ ఇస్తే ఆ నటుడి పరిస్థితి ఏంటి? తన తొలి సినిమాకు ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నానని అంటున్నాడు కమెడియన్గా మంచి పేరు సంపాదించిన సుదర్శన్.
ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసిన సుదర్శన్.. ఇటీవల కమెడియన్గా మంచి స్థాయినే అందుకున్నాడు. టిపికల్ కామెడీ టైమింగ్, నెల్లూరు యాసతో డైలాగులు చెప్పే సుదర్శన్.. ఇటీవల సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారిలోనూ భలేగా నవ్వించాడు.
తెలుగులో తన తొలి చిత్రం.. శర్వానంద్ హీరోగా సుజీత్ రూపొందించిన రన్ రాజా రన్. అందులో తనది చాలా చిన్న పాత్రే. ఆ సినిమాకు తాను తీసుకున్న పారితోషకం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు సుదర్శన్.
రన్ రాజా రన్ తనకు తొలి సినిమా కాబట్టి.. సెంటిమెంటుగా ఎంతో కొంత పారితోషకం తీసుకోవాలనుకున్నానని.. ఫస్ట్ మూవీ ఫ్రీగా చేస్తే తర్వాత డబ్బులు రావేమో అనుకున్నానని చెప్పాడు సుదర్శన్. వెయ్యో రెండు వేలో ఇస్తే బాగుండని అనుకున్నట్లు అతను వెల్లడించాడు.
ఐతే డబ్బుల కోసం వెళ్లి టీంలో వాళ్లతో మాట్లాడితే.. సినిమాకు బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అయిందని, రెమ్యూనరేషన్ అదీ తర్వాతి సినిమాకు చూద్దామని ప్రొడక్షన్ వాళ్లు అన్నట్లు సుదర్శన్ వెల్లడించాడు. ఐతే సినిమా అంతా అయ్యాక తనకు ఒక కవర్ ఇచ్చారని.. అందులో వెయ్యి రూపాయలు ఉంటాయని అనుకున్నానని.. తీసి చూస్తే రూ.3500 ఉన్నాయని.. తాను ఆశించిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఉండడంతో చాలా సంతోషించానని సుదర్శన్ వెల్లడించాడు.
ఆ డబ్బులు గుడిలో హుండీలో వేద్దామా.. ఇంకేమైనా మంచి పని చేద్దామా అని ఆలోచించి.. చివరికి ఫ్రెండ్స్తో కలిసి ఖర్చు పెట్టేసినట్లు సుదర్శన్ తెలిపాడు. తర్వాత ఓ సందర్భంలో యువి ప్రొడక్షన్స్ అధినేత వంశీకి ఈ విషయం చెబితే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చామంటే, ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలన్న మాట అని జోక్ చేసినట్లు సుదర్శన్ తెలిపాడు.
మరోవైపు ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్లు గెలిచే డబ్బంతా రియల్ అని బయట జనం అనుకుంటారని.. తాను కూడా అక్కడ మూణ్నాలుగు కోట్ల దాకా గెలిచానని.. అదంతా నిజం అనుకుని బయటి వాళ్లు డబ్బుల గురించి అడుగుతుంటారని.. అది నిజం కాదని చాలామందికి తెలియదని సుదర్శన్ చెప్పాడు.
This post was last modified on February 8, 2026 11:35 pm
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అంటే విజిల్స్ మోత మోగాల్సిందే. ఆ నగరానికి చెందిన ఐపీఎల్ జట్టు చెన్నై…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడిగా గుణశేఖర్ ఆ…
గత నెల సంక్రాంతి పండగ సందర్భంగా తమిళంలో విడుదలైన పరాశక్తిని ఆ టైంలోనే తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ చేయాలని ప్లాన్…
సంక్రాంతి పందెంలో విజేతగా నిలిచి మూడు వందల డెబ్భై అయిదు కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన…
అనుకోకుండా పిడుగు పడినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సోగ్గాడే సీక్వెల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నేరుగా టైటిల్ చెప్పకపోయినా క్యాప్షన్…
మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న చడిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా జమ్మల మడుగు…