జన నాయకుడు విడుదల రాజా సాబ్ తో పాటే ఉన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో విజయ్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ మీద అభిమానుల్లో బోలెడు సందేహాలున్నాయి. ఎందుకంటే ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది.
ఇటీవలే పలు ప్రెస్ మీట్లలో దర్శకులు హెచ్ వినోత్ కానీ అనిల్ రావిపూడి కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. తలపతి సినిమా అంటూ ఎలివేషన్ ఇచ్చారు తప్పించి దానికి దీనికి సంబంధం లేదని కొట్టి పారేయలేదు. పైగా వదిలిన పాటల్లో శ్రీలీల పాత్రని మమిత బైజు చేసిందనే సూచనలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇదే సమస్య కానుంది.
మాములుగా విజయ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కుతాయి. తుపాకీ నుంచి లియో దాకా గ్రాఫ్ చూసుకుంటే కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. సీరియల్ లా ఉందనిపించుకున్న వారసుడు సైతం దారుణంగా పోలేదు. విపరీతమైన పోటీలోనూ డీసెంట్ రెవిన్యూ అందుకుంది.
కానీ జన నాయకుడుకి అలాంటి ఛాన్స్ ఉండటం డౌటే. ఎందుకంటే భగవంత్ కేసరి మెయిన్ స్టోరీని మాత్రమే తీసుకుని ఎన్ని మార్పులు చేసినా, బాలయ్య సినిమా ఆల్రెడీ చూశాం కాబట్టి మళ్ళీ ఇది ఎందుకనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుల్లో ఉంటుంది. పైగా వేరే ఆప్షన్లు బోలెడున్నాయి. ఇది వసూళ్ల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.
ఇదంతా జన నాయకుడు నిర్మాతలకు తెలియక కాదు. వాళ్ళ టార్గెట్ ప్రధానంగా తమిళ మరియు ఓవర్సీస్ మార్కెట్. అక్కడ వర్కౌట్ అయితే మొత్తం రికవరీ జరిగిపోతుంది. మన దగ్గర ఎంత వచ్చినా బోనస్ అవుతుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు పంపిణికి అంత సుముఖంగా లేకపోవడంతో పివిఆర్ ఐనాక్స్ రంగంలోకి దిగి రిలీజ్ కు సహాయపడుతోంది.
తెలుగు ప్రమోషన్లు పూర్తి లైట్ తీసుకున్నారు. తమిళంలో ఉన్న హైప్ కనీసం పది శాతం ఇక్కడ ఉందా అంటే డౌటనిపించే స్థాయిలో బజ్ కనిపించడం లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన జన నాయకుడులో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…