Political News

అందులో ఆ రెండు రాష్ట్రాలను దాటేసిన ఏపీ

దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైన వాతావరణమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది..ఈ జాబితాలో ఒడిశా 13.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం కేంద్రీకృతమవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతున్నాయన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనానికి నిదర్శనంగా పేర్కొంది.

This post was last modified on January 2, 2026 11:04 pm

Share

Recent Posts

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

48 minutes ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

2 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

2 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

3 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

3 hours ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

4 hours ago