దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.
పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైన వాతావరణమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది..ఈ జాబితాలో ఒడిశా 13.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం కేంద్రీకృతమవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతున్నాయన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనానికి నిదర్శనంగా పేర్కొంది.
This post was last modified on January 2, 2026 11:04 pm
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…