మెగా ఫాన్స్ కలలో కూడా మర్చిపోని డిజాస్టర్ భోళా శంకర్. చిరంజీవి ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. మెహర్ రమేష్ దర్శకత్వం, మహతి స్వరసాగర్ సంగీతం, తమన్నా గ్లామర్, కీర్తి సురేష్ సెంటిమెంట్ ఇవేవి బొమ్మ బోల్తా పడకుండా కాపాడలేకపోయాయి. ట్విస్ట్ ఏంటంటే దీన్ని ముందు ప్లాన్ చేసుకున్నది పవన్ కళ్యాణ్ తో. తమిళ ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ఏఎం రత్నం దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి తెలుగులో పవర్ స్టార్ అయితే బాగుంటుందని భావించారు. అయితే ఆ టైములో ఎన్నికలు అడ్డురావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాల్సి వచ్చింది.
దీనికన్నా ముందు పవన్ స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రాహి అనే మూవీని అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలయ్యాక ఆపేయాల్సి వచ్చింది. డైరెక్షన్ చేసే పరిస్థితిలో పవన్ లేకపోవడంతో దాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం ఇష్టం లేక పూర్తిగా ఆపేశారు. లేదంటే జానీ తర్వాత పవన్ దర్శకత్వం వహించిన సినిమాగా సత్యాగ్రహి నిలిచిపోయేది. ఈ సినిమాతో పాటు వేదాళం రీమేక్ మిస్ చేసుకున్న ఏఎం రత్నంకు కమిట్ మెంట్ బాకీ ఉన్న పవన్ దాన్ని హరిహర వీరమల్లుతో తీరుస్తున్నారు. వీళ్ళ కలయికలో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్టుతో పాటు బంగారం లాంటి కమర్షియల్ మూవీ వచ్చాయి. రెండోది అంత విజయం సాధించలేదు.
ఒకవేళ నిజంగానే రత్నం కనక వేదాళం తెలుగులో పవన్ తో తీసి ఉంటే భోళా శంకర్ గండం మెగాస్టార్ కు తప్పేది. అజిత్ నటించిన ఒరిజినల్ లోనే పరమ రొటీన్ కథా కథనాలు ఉంటాయి. అలాంటిదాన్ని మళ్ళీ తీయాలనుకోవడమే పెద్ద రిస్క్. కాకపోతే దాన్ని అనిల్ సుంకర మోయాల్సి వచ్చింది. గతంలో అతడు, ఇడియట్ బ్లాక్ బస్టర్స్ కి నో చెప్పి అవి ఇతర హీరోలకు వెళ్లేలా చేసిన పవన్ వేదాళం రీమేక్ మాత్రం అన్నయ్య చేయడం బహుశా ఊహించి ఉండరు.. భోళా శంకర్ దెబ్బ ఏ స్థాయి అంటే చిరంజీవి కొత్త సినిమా రావడానికి కొంచెం అటుఇటుగా రెండు సంవత్సరాల సమయం పట్టింది. ఇదంతా విధి లిఖితం.
This post was last modified on May 21, 2025 10:39 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…