Political News

జగన్ ఫొటో పీకి బాబు ఫొటో పెట్టారు

నిజమే… అనంతపురంలో బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోను పీకి పారేసిన టీడీపీ ఎమ్మెల్యేలు… దాని స్థానంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టారు. బాబు ఫొటో పక్కనే భారత జాతిపిత మహాత్మా గాంధీ ఫొటోను కూడా పెట్టారు. ఈ ఘటన నగరంలోని జిల్లా పరిషత్ భవన సముదాయంలోని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో చోటుచేసుకోగా… జగన్ ఫొటో పీకివేత సందర్భంగా ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

సాధారణంగా ఏదేనీ రాష్ట్రం పరిధిలోని జిల్లాలు, మండలాలు, ఇతరత్రా స్తానిక సంస్థల కార్యాలయాలు, చివరాఖరుకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేత ఫొటో ఉంటుంది. ఆయా నేతలు, అదికారులు మరింత దేశభక్తులు అయితే భారత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలను కూడా గోలకు వేలాడదీసి నిత్యం వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఏపీలో వైసీపీ పాలన ముగిసి కూటమి పాలన ప్రారంభమై అప్పుడే ఏడాది కావస్తోంది. అయినప్పటికీ అనంత జడ్పీ చైర్ పర్సన్ కార్యాలయంలో మాత్రం ఇంకా జగన్ ఫొటోనే ఉంది. చంద్రబాబు ఫొటోను అక్కడి అదికారులు ఓ మూలన పడేశారు.

అనంత జడ్పీ పీఠంపై వైసీపీకి చెందిన గిరిజమ్మ కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటిదాకా దాదాపుగా గిరిజమ్మే జడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగనున్నారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే సీఎం ఫొటోను మార్చమంటూ చంద్రబాబు ఫొటోను కూడా ఆమె కార్యాలయ సిబ్బందికి అందజేశారు. దానిని గిరిజమ్మ మాత్రం మార్చనీయలేదట. తమ పార్టీ అదినేత జగన్ ఫొటోను పీకడానికి ఇష్టపడని గిరిజమ్మ… బాబు ఫొటోను మాత్రం ఓ మూలన పడేశారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీ నేతల అదీనంలోని కార్యాలయాల్లోకి అదికార పార్టీ నేతలు అయినా పెద్దగా వెళ్లరు కదా. అనంతలోనూ అదే జరిగింది.

బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగగా… దానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు అలిమినేని సురేంద్ర బాబు, ఎంఎస్ రాజు, దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్ లకు అనూహ్యంగా చంద్రబాబు ఫొటో స్టోర్ రూమ్ పక్కగా కింద కనిపించింది. గోడకు ఠీవీగా వేలాడాల్సిన బాబు ఫొటో ఇలా స్టోర్ రూమ్ పక్కన పారేసి ఉందేమిటంటూ వారు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడగా.. ఏడాది గడుస్తున్నా జగన్ ఫొటోను మార్చకపోవడంపై వారు జడ్పీ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి మరీ జగన్ ఫొటోను పీకి పారేసి.. దాని స్థానంలో చంద్రబాబు ఫొటోను, దాని పక్కన గాంధీ ఫొటోను పెట్టారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ వారిని అడ్డుకునేందుకు యత్నించగా… టీడీపీ ఎమ్మెల్యేలు ఉగ్రరూపం చూపడంతో వెనక్కు తగ్గారు.

This post was last modified on May 21, 2025 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

2 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

4 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago