గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ కాండ ఆధారంగా దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తీసిన విధానం ప్రేక్షకులనే కాదు విమర్శకులనూ మెప్పించింది. అయితే ఈయన తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో రామ్ చరణ్ ని కలిసినట్టు ముంబై అప్డేట్.
ఆరు నెలలుగా పలు దఫాలు ఇద్దరూ కలుసుకున్నారని, ఈ కాంబోని తెరకెక్కించేందుకు నిర్మాత మధు మంతెన సిద్ధంగా ఉన్నారని దాని సారాంశం. అయితే ఫైనల్ వెర్షన్ లాక్ అయితే తప్ప అఫీషియల్ న్యూస్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వేచి చూడాలి.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్సి 16 కోసం బుచ్చిబాబుతో పని చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ వేగంగా జరుగుతోంది. డే అండ్ నైట్ చిత్రీకరణ చేస్తున్నారు. జాన్వీ కపూర్ త్వరలోనే జాయిన్ కానుంది. దీని తర్వాత సుకుమార్ కనక స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉంటే ఆర్సి 17 వెంటనే స్టార్ట్ అవుతుంది.
పుష్ప 2 హ్యాంగోవర్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న సుకుమార్ తక్కువ టైంలో రెడీ చేయగలరా అంటే చెప్పలేం. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే ఆర్సి18 కోసం నిఖిల్ నగేష్ భట్ రంగంలోకి దిగొచ్చు. ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే. తాజాగా ఇతను ఇన్స్ టాలో చరణ్ ని ఫాలో కావడం ఫ్యాన్స్ దృష్టిలో పడింది.
గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు పడిన బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ఇకపై టైం వృథా చేయకూండా వేగంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో హిందీ దర్శకులను కలుస్తున్నాడు. ఆ మధ్య రాజ్ కుమార్ హిరానీతో మీటింగ్ జరిగిందన్నారు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి సౌండ్ లేదు.
దీని కన్నా ముందు నిఖిల్ భట్ నిర్మాత మురాద్ ఖేతానికి ఒక ప్రాజెక్టు చేయాలి. చరణ్ ఫ్రీ అయ్యేలోపు దీన్ని పూర్తి చేయొచ్చు. ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ కార్యరూపం దాలిస్తే తప్ప ఫాన్స్ ఆశలు పెట్టుకోవడానికి లేదు. అప్పటిదాకా వేచి చూడటం తప్ప ఆప్షన్ ఏముంది.
This post was last modified on February 11, 2025 5:38 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…