హైదరాబాద్ మహానగరంలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు ఒక మైనర్ బాలిక (16)పై గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. అది కూడా ఇంట్లోకి చొరబడి మరీ అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది. పట్టపగలు.. ఇంట్లోకి జొరబడి.. కత్తితో బెదిరింపులకు దిగి గ్యాంగ్ రేప్ చేయటం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బే తీసేలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన పదహారేళ్ల బాలిక తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. దీంతో.. తన సోదరుడితో కలిసి మీర్ పేటలోని కాలనీలోకి పదిహేను రోజుల క్రితం వచ్చారు. సమీప బంధువైన ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. బాధిత మహిళ దిల్ షుక్ నగర్ లోని ఒక బట్టల షాపులో పని చేస్తుండగా.. ఆమె సోదరుడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల వేళలో బాధితురాలు తన సోదరుడు.. మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న వేళలో.. ఎనిమిది మంది ఒక్కసారిగా ఇంట్లోకి జొరబడ్డారు. వారిలో కొందరు గంజాయి మత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అందులోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు. బిల్డింగ్ లోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలిన వారు ఇంట్లోనే ఉండి బాధితురాలి సోదరుడు.. మిగిలిన చిన్నారుల్ని బంధించి ఉంచారు. బాధితురాలికి పైగదిలోకి తీసుకెళ్లిన నిందితుల్లో ముగ్గురు.. కత్తితో బెదిరింపులకు దిగి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో పరారైనట్లుగా బాలిక బంధువులు చెబుతున్నారు. అయితే.. అత్యాచారానికి పాల్పడిన వారిలో కొందరు బాధితురాలు నివాసం ఉండే ఇంటి కిందన ఉండే వారని చెబుతున్నారు.
నిందితుల్లో కింది అంతస్తులో ఉండే టైసన్.. మంగళ్ హాట్ కు చెందిన రౌడీషీటర్ అబేద్ లాలాలు ఉన్నట్లుగా బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. మరో ఇద్దరు కూడా అక్కడకు దగ్గర నివాసం ఉండే వారని చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత మీర్ పేట పోలీసుల్ని ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఏడు టీంలను ఏర్పాటు చేసి.. నిందితుల్లో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం అరెస్టుల్ని కన్ఫర్మ్ చేయట్లేదు.
This post was last modified on August 22, 2023 11:30 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…