చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటు ఆమధ్య కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తెగ హడావుడి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాల మద్దతుందని చూపించుకునేందుకు మాత్రమే కవిత హడావుడి చేశారని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ఎందుకు టికెట్లు ఇవ్వటంలేదని విచిత్రమైన వాదన వినిపించారు. అప్పట్లో కవిత హడావుడి చేసి అందరు ఆశ్చర్యపోయారు. సీన్ కట్ చేస్తే సొంతపార్టీలోనే మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేక చేతులెత్తేశారు.
రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే బీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీయార్ ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. వీరిలో ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లిచ్చారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం సొంతపార్టీ బీఆర్ఎస్ లోనే 33 శాతం రిజర్వేషన్ కల్పించలేకపోయారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం 33 శాతం రిజర్వేషన్లంటే 39 టికెట్లు మహిళలకు దక్కుండాలి.
దక్కాల్సిన టికెట్లకు ఇచ్చిన టికెట్లకు అసలేమైనా పొంతనుందా ? ఇతర పార్టీల్లో మహిళలకు టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్న కవిత సొంతపార్టీలో ఎందుకు ఇప్పించుకోలేకపోయారు ? అంటే అప్పట్లో మహిళా రిజర్వేషన్ పేరుతో కవిత చేసిన హడావుడి అంతా ఉత్త డ్రామా అని తేలిపోయింది. బీఆర్ఎస్ అంటేనే కేసీయార్ సొంత ఆస్తికింద లెక్క. కేసీయార్ ఆస్తంటే కవిత ఆస్తిగానే అనుకోవాలి. ప్రైవేటుపార్టీలన్నీ పార్టీల అధినేతల సొంతఆస్తిగానే జనాలు భావిస్తున్నారు. మరి అలాంటపుడు సొంతపార్టీలోనే ఎందుకు మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేకపోయారు ?
నిజానికి కొన్ని విషయాలు నినాదాలవరకు బాగానే ఉంటుంది. కానీ ఆచరణలోకి రావాలంటే జరిగేపనికాదు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మగవాళ్ళతో పోటీ పడి నెగ్గుకు రాగలిగినంత సామర్ధ్యం ఉండే మహాళలు చాలా తక్కువమంది ఉంటారు. పురుషులతో పోటీపడలేరని తెలిసి ఏ పార్టీ అయినా మహిళలను పోటీలోకి దింపి దెబ్బతినేందుకు సిద్ధంగా ఉంటుందా ? పైగా ఈ ఎన్నిక కేసీయార్ జాతీయ రాజకీయాలకు మెట్టులాగ పనిచేస్తుంది. హ్యాట్రిక్ కొడితే జాతీయ స్ధాయిలో కేసీయార్ కొంత చెల్లుబాటవుతారు లేకపోతే అంతే సంగతులు.
This post was last modified on August 22, 2023 1:52 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…