చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటు ఆమధ్య కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తెగ హడావుడి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాల మద్దతుందని చూపించుకునేందుకు మాత్రమే కవిత హడావుడి చేశారని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ఎందుకు టికెట్లు ఇవ్వటంలేదని విచిత్రమైన వాదన వినిపించారు. అప్పట్లో కవిత హడావుడి చేసి అందరు ఆశ్చర్యపోయారు. సీన్ కట్ చేస్తే సొంతపార్టీలోనే మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేక చేతులెత్తేశారు.
రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే బీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీయార్ ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. వీరిలో ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లిచ్చారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం సొంతపార్టీ బీఆర్ఎస్ లోనే 33 శాతం రిజర్వేషన్ కల్పించలేకపోయారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం 33 శాతం రిజర్వేషన్లంటే 39 టికెట్లు మహిళలకు దక్కుండాలి.
దక్కాల్సిన టికెట్లకు ఇచ్చిన టికెట్లకు అసలేమైనా పొంతనుందా ? ఇతర పార్టీల్లో మహిళలకు టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్న కవిత సొంతపార్టీలో ఎందుకు ఇప్పించుకోలేకపోయారు ? అంటే అప్పట్లో మహిళా రిజర్వేషన్ పేరుతో కవిత చేసిన హడావుడి అంతా ఉత్త డ్రామా అని తేలిపోయింది. బీఆర్ఎస్ అంటేనే కేసీయార్ సొంత ఆస్తికింద లెక్క. కేసీయార్ ఆస్తంటే కవిత ఆస్తిగానే అనుకోవాలి. ప్రైవేటుపార్టీలన్నీ పార్టీల అధినేతల సొంతఆస్తిగానే జనాలు భావిస్తున్నారు. మరి అలాంటపుడు సొంతపార్టీలోనే ఎందుకు మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేకపోయారు ?
నిజానికి కొన్ని విషయాలు నినాదాలవరకు బాగానే ఉంటుంది. కానీ ఆచరణలోకి రావాలంటే జరిగేపనికాదు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మగవాళ్ళతో పోటీ పడి నెగ్గుకు రాగలిగినంత సామర్ధ్యం ఉండే మహాళలు చాలా తక్కువమంది ఉంటారు. పురుషులతో పోటీపడలేరని తెలిసి ఏ పార్టీ అయినా మహిళలను పోటీలోకి దింపి దెబ్బతినేందుకు సిద్ధంగా ఉంటుందా ? పైగా ఈ ఎన్నిక కేసీయార్ జాతీయ రాజకీయాలకు మెట్టులాగ పనిచేస్తుంది. హ్యాట్రిక్ కొడితే జాతీయ స్ధాయిలో కేసీయార్ కొంత చెల్లుబాటవుతారు లేకపోతే అంతే సంగతులు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…