న‌టి శోభ‌న ఇంట్లో చోరీ.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే?

అల‌నాటి అందాల తార‌.. ఒక‌ప్ప‌టి హీరోయిన్ శోభ‌న గుర్తున్నారా? ఎన్నో అద్భుత‌మైన సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించారు. విక్రమ్‌, రౌడీ అల్లుడు, మువ్వ‌గోపాలుడు, అల్లుడు గారు, త్రిమూర్తులు, రుద్ర‌వీణ‌, నారీ నారీ న‌డుమ మురారి, అప్పుల అప్పారావు త‌దిత‌ర చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ మెద‌లెట్టారు. కొన్ని చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే తాజాగా చెన్నైలోని ఆమె ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. తేనాంపేట్‌లోని శ్రీమాన్ శ్రీనివాస కాల‌నీలో త‌ల్లితో క‌లిసి ఉంటున్నారు శోభ‌న‌.

త‌న త‌ల్లికి స‌ప‌ర్య‌లు చేసేందుకు శోభ‌న‌ ఒక మ‌హిళ‌ను ప‌నిలో పెట్టుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆమె త‌ల్లి ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు పోతున్నాయి. ఆ ఇంట్లో శోభ‌న‌, ఆమె త‌ల్లి, ప‌నిమ‌నిషి త‌ప్ప ఇత‌రులు ఉండే అవ‌కాశం లేదు. అందుకే ప‌నిమ‌నిషిని ఆమె అడ‌గ్గా.. తీయ‌లేద‌ని చెప్పింది. దీంతో పోలీసుల‌ను శోభ‌న ఆశ్ర‌యించారు.

ప‌నిమ‌నిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. తానే డ‌బ్బులు దొంగ‌త‌నం చేసిన‌ట్లు ఆ ప‌నిమ‌నిషి ఒప్పుకుంది. గ‌త నెల రోజుల నుంచి మొత్తం రూ.41 వేల వ‌ర‌కు చోరీ చేసిన‌ట్లు చెప్పింది. పేద‌రికం కార‌ణంగానే డ‌బ్బు మీద ఆశ‌లో ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని ఆ ప‌నిమ‌నిషి తెలిపింది. త‌న‌ను ప‌నిలో నుంచి తీసేయొద్ద‌ని కూడా శోభ‌న‌ను బ‌తిమిలాడింది. దీంతో తిరిగి ఆమెను ప‌నిలో పెట్టుకున్న శోభ‌న‌.. ఆ కొట్టేసిన డ‌బ్బుల‌ను మాత్రం ఆమె జీవితంలో నుంచి క‌ట్ చేశారు. ప్ర‌ముఖ భ‌ర‌త నాట్య క‌ళాకారిణి కూడా అయిన శోభ‌న మంచి మ‌న‌సుకు అభిమానులు ఫిదా అయ్యారు. దొంగ‌త‌నం చేశాక కూడా ప‌నిమ‌నిషి మీద ద‌య‌తో ప‌నిలో కొన‌సాగించ‌డంతో శోభ‌న‌పై ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.