వావిలేదు.. వరుస లేదు.. అంటారు కదా! దీనిని నిజం చేసింది ఓ మహిళ. అది కూడా ఎక్కడో కాదు.. మన కడపలోనే. సొంత అల్లుడి తమ్ముడితో సెక్సువల్ సంబంధం పెట్టుకుని.. మూడు నెలల గర్భం కూడా తెచ్చు కుంది. అంతేకాదు.. అతనేదో.. పెళ్లికి సిద్ధం కాగానే.. నేరుగా వెళ్లి.. “నేను ఉండగానే పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నిస్తూ.. కత్తితో పొడిచి చంపింది!
క్రైం సీరియళ్లను, సినిమాలను కూడా తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. మన కడప జిల్లాలోనే జరిగింది. ఇంతకీ ఎవరు? ఏంటి? అనే విషయం చూస్తే.. కడప జిల్లాలోని రాజుపాలెం మండల కేంద్రం. ఇక్కడ ఓ మహిళ(40-పేరు చెప్పడం బాగోదు)కు ఐదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లీడు రావడంతో.. ఇంటి వెనుక వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద దస్తగిరికి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపింది.
ఈ మహిళ కూడా.. స్థానికంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తోంది. అయితే, అనూహ్యంగా.. తన సొంత అల్లుడు పెద్ద దస్తగిరికి సొంత తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నాడు.మరి ఎక్కడ కుదిరిందో.. ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఆ మహిళ(అంటే.. దస్తగిరి సొంత అత్త)కు చిన్న దస్తగిరికి సెక్సువల్ రిలేషన్ పెరిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఎవరికి అనుమానం కూడా రాలేదు.
అయితే, వయసులో ఉన్న చిన్నదస్తగిరికి అన్న, వదిన(సదరు మహిళ కుమార్తె, అల్లుడు) పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల నిశ్చితార్థం కూడా పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయం తెలిసిన సదరు మహిళ.. నేరుగా అల్లుడి ఇంటికి వచ్చి నేనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ చిన్నదస్తగిరితో వాగ్వాదానికి దిగింది.
ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేయించిన పరీక్షల్లో.. సదరు మహిళ గర్భిణీ అని తేలడం గమనార్హం.
This post was last modified on December 12, 2022 7:21 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…