వావిలేదు.. వరుస లేదు.. అంటారు కదా! దీనిని నిజం చేసింది ఓ మహిళ. అది కూడా ఎక్కడో కాదు.. మన కడపలోనే. సొంత అల్లుడి తమ్ముడితో సెక్సువల్ సంబంధం పెట్టుకుని.. మూడు నెలల గర్భం కూడా తెచ్చు కుంది. అంతేకాదు.. అతనేదో.. పెళ్లికి సిద్ధం కాగానే.. నేరుగా వెళ్లి.. “నేను ఉండగానే పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నిస్తూ.. కత్తితో పొడిచి చంపింది!
క్రైం సీరియళ్లను, సినిమాలను కూడా తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. మన కడప జిల్లాలోనే జరిగింది. ఇంతకీ ఎవరు? ఏంటి? అనే విషయం చూస్తే.. కడప జిల్లాలోని రాజుపాలెం మండల కేంద్రం. ఇక్కడ ఓ మహిళ(40-పేరు చెప్పడం బాగోదు)కు ఐదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లీడు రావడంతో.. ఇంటి వెనుక వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద దస్తగిరికి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపింది.
ఈ మహిళ కూడా.. స్థానికంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తోంది. అయితే, అనూహ్యంగా.. తన సొంత అల్లుడు పెద్ద దస్తగిరికి సొంత తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నాడు.మరి ఎక్కడ కుదిరిందో.. ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఆ మహిళ(అంటే.. దస్తగిరి సొంత అత్త)కు చిన్న దస్తగిరికి సెక్సువల్ రిలేషన్ పెరిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఎవరికి అనుమానం కూడా రాలేదు.
అయితే, వయసులో ఉన్న చిన్నదస్తగిరికి అన్న, వదిన(సదరు మహిళ కుమార్తె, అల్లుడు) పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల నిశ్చితార్థం కూడా పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయం తెలిసిన సదరు మహిళ.. నేరుగా అల్లుడి ఇంటికి వచ్చి నేనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ చిన్నదస్తగిరితో వాగ్వాదానికి దిగింది.
ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేయించిన పరీక్షల్లో.. సదరు మహిళ గర్భిణీ అని తేలడం గమనార్హం.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…