వావిలేదు.. వరుస లేదు.. అంటారు కదా! దీనిని నిజం చేసింది ఓ మహిళ. అది కూడా ఎక్కడో కాదు.. మన కడపలోనే. సొంత అల్లుడి తమ్ముడితో సెక్సువల్ సంబంధం పెట్టుకుని.. మూడు నెలల గర్భం కూడా తెచ్చు కుంది. అంతేకాదు.. అతనేదో.. పెళ్లికి సిద్ధం కాగానే.. నేరుగా వెళ్లి.. “నేను ఉండగానే పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నిస్తూ.. కత్తితో పొడిచి చంపింది!
క్రైం సీరియళ్లను, సినిమాలను కూడా తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. మన కడప జిల్లాలోనే జరిగింది. ఇంతకీ ఎవరు? ఏంటి? అనే విషయం చూస్తే.. కడప జిల్లాలోని రాజుపాలెం మండల కేంద్రం. ఇక్కడ ఓ మహిళ(40-పేరు చెప్పడం బాగోదు)కు ఐదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లీడు రావడంతో.. ఇంటి వెనుక వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద దస్తగిరికి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపింది.
ఈ మహిళ కూడా.. స్థానికంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తోంది. అయితే, అనూహ్యంగా.. తన సొంత అల్లుడు పెద్ద దస్తగిరికి సొంత తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నాడు.మరి ఎక్కడ కుదిరిందో.. ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఆ మహిళ(అంటే.. దస్తగిరి సొంత అత్త)కు చిన్న దస్తగిరికి సెక్సువల్ రిలేషన్ పెరిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఎవరికి అనుమానం కూడా రాలేదు.
అయితే, వయసులో ఉన్న చిన్నదస్తగిరికి అన్న, వదిన(సదరు మహిళ కుమార్తె, అల్లుడు) పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల నిశ్చితార్థం కూడా పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయం తెలిసిన సదరు మహిళ.. నేరుగా అల్లుడి ఇంటికి వచ్చి నేనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటా
వంటూ చిన్నదస్తగిరితో వాగ్వాదానికి దిగింది.
ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేయించిన పరీక్షల్లో.. సదరు మహిళ గర్భిణీ అని తేలడం గమనార్హం.
This post was last modified on December 12, 2022 7:21 am
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…
పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…
అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…
ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…