వావిలేదు.. వరుస లేదు.. అంటారు కదా! దీనిని నిజం చేసింది ఓ మహిళ. అది కూడా ఎక్కడో కాదు.. మన కడపలోనే. సొంత అల్లుడి తమ్ముడితో సెక్సువల్ సంబంధం పెట్టుకుని.. మూడు నెలల గర్భం కూడా తెచ్చు కుంది. అంతేకాదు.. అతనేదో.. పెళ్లికి సిద్ధం కాగానే.. నేరుగా వెళ్లి.. “నేను ఉండగానే పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నిస్తూ.. కత్తితో పొడిచి చంపింది!
క్రైం సీరియళ్లను, సినిమాలను కూడా తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. మన కడప జిల్లాలోనే జరిగింది. ఇంతకీ ఎవరు? ఏంటి? అనే విషయం చూస్తే.. కడప జిల్లాలోని రాజుపాలెం మండల కేంద్రం. ఇక్కడ ఓ మహిళ(40-పేరు చెప్పడం బాగోదు)కు ఐదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లీడు రావడంతో.. ఇంటి వెనుక వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద దస్తగిరికి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపింది.
ఈ మహిళ కూడా.. స్థానికంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తోంది. అయితే, అనూహ్యంగా.. తన సొంత అల్లుడు పెద్ద దస్తగిరికి సొంత తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నాడు.మరి ఎక్కడ కుదిరిందో.. ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఆ మహిళ(అంటే.. దస్తగిరి సొంత అత్త)కు చిన్న దస్తగిరికి సెక్సువల్ రిలేషన్ పెరిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఎవరికి అనుమానం కూడా రాలేదు.
అయితే, వయసులో ఉన్న చిన్నదస్తగిరికి అన్న, వదిన(సదరు మహిళ కుమార్తె, అల్లుడు) పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల నిశ్చితార్థం కూడా పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయం తెలిసిన సదరు మహిళ.. నేరుగా అల్లుడి ఇంటికి వచ్చి నేనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటా
వంటూ చిన్నదస్తగిరితో వాగ్వాదానికి దిగింది.
ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేయించిన పరీక్షల్లో.. సదరు మహిళ గర్భిణీ అని తేలడం గమనార్హం.
This post was last modified on December 12, 2022 7:21 am
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…