రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఉదయ్పుర్లోని మల్దాస్ వీధిలో టైలర్ షాపు నిర్వహిస్తున్న కన్నయ్యలాల్ను ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. వినియోగదారు ల మాదిరిగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కన్నయ్యపై కత్తితో దాడి చేయగా, మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్పై పారిపోయారు.
ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉదయ్పూర్ సహా చుట్టుపక్కల ఉన్న రెండు మూడు జిల్లాల్లో 8 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జోధ్పూర్ పర్యటనను రద్దు చేసుకుని జైపూర్కు తిరిగి వచ్చారు.
ఈ దారుణ హత్య నేపథ్యంలో పోలీసులు ఉదయ్పుర్లో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. హత్యను సీరియస్గా తీసుకున్న కేంద్రం.. కేసును ఎన్ఐఏ అప్పగించింది. ఈ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని కేంద్రం హోం శాఖ పేర్కొంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
తీవ్ర ఉద్రిక్తత
టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.
This post was last modified on June 29, 2022 6:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…