Trends

ఆ టైల‌ర్ హ‌త్య.. అంత‌ర్జాతీయ కుట్రా? కేంద్రం ఏమందంటే

రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ యువకుడిని అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. రాష్ట్రాన్ని అత‌లాకుతలం చేసింది. ఉదయ్‌పుర్‌లోని మల్దాస్ వీధిలో టైల‌ర్ షాపు నిర్వ‌హిస్తున్న క‌న్న‌య్య‌లాల్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. వినియోగదారు ల మాదిరిగా వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు కన్నయ్యపై కత్తితో దాడి చేయ‌గా, మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్పై పారిపోయారు.

ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేప‌థ్యంలో వెంట‌నే స్పందించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేశారు. ఉద‌య్‌పూర్ స‌హా చుట్టుప‌క్క‌ల ఉన్న రెండు మూడు జిల్లాల్లో 8 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధించారు. ఇక‌, ఈ ఘ‌ట‌నపై ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. జోధ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకుని జైపూర్‌కు తిరిగి వచ్చారు.

ఈ దారుణ హత్య నేపథ్యంలో పోలీసులు ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. హత్యను సీరియస్గా తీసుకున్న కేంద్రం.. కేసును ఎన్ఐఏ అప్పగించింది. ఈ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉంద‌ని కేంద్రం హోం శాఖ పేర్కొంది. ఈ కోణంలోనే ద‌ర్యాప్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

తీవ్ర ఉద్రిక్త‌త‌
టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్‌చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

This post was last modified on June 29, 2022 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

15 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

34 minutes ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

1 hour ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

1 hour ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

3 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

5 hours ago