ఊహించిన దానికన్నా చాలా ముందే విరాట పర్వం ఓటిటి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జూలై 1 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది. అంటే సరిగ్గా 14 రోజులు పూర్తవ్వడం ఆలస్యం ఇలా స్మార్ట్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారన్న మాట. ఒకపక్క టాలీవుడ్ లో ఇకపై నిర్మాతలు 50 రోజుల తర్వాతే ఓటిటికి ఇవ్వాలనే నిబంధనను పెట్టుకున్న రోజే ఈ ట్విస్టు జరగడం విశేషం. ఎలాగూ ఈ సినిమాను చూడని వాళ్ళు కోట్లలో ఉన్నారు కాబట్టి డిజిటల్ లో వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇదంతా బాగానే ఉంది కానీ విరాటపర్వం రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు గట్రా మాములుగా చేయలేదు. కర్నూల్ నుంచి వరంగల్ దాకా వేడుకలు నిర్వహించారు. టీవీ9తో మొదలుపెట్టి సిద్ధూ జొన్నలగడ్డ దాకా లెక్కలేనన్ని ప్రోగ్రాంలు చేశారు. ముఖ్యంగా సాయిపల్లవి కష్టం గురించి మాటల్లో చెప్పేది కాదు. బరువంతా తన మీదే పెట్టేయడంతో నో అనకుండా అడిగిన చోటల్లా పబ్లిసిటీలో పాలు పంచుకుంది. ఇంతా చేసింది థియేటర్లలో బొమ్మ బాగా ఆడి నిర్మాతకు నాలుగు డబ్బులు రావాలనే కదా.
చూస్తే ఇప్పుడిలా యుటర్న్ తీసుకోక తప్పలేదు. కంటెంట్ మీద ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. జనం హాలు దాకా వచ్చి చూసేందుకు ఈ నక్సల్ లవ్ స్టోరీ మీద ఆసక్తి చూపించలేదు. కట్ చేస్తే వారం లోపే నెగటివ్ షేర్లు పడ్డాయి. దాంతో ముందే అగ్రిమెంట్ అలా చేసుకున్నారో లేక ఆచార్య, రాధే శ్యామ్ లాగా తిరిగి కొత్తగా రాసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి చాలా ముందుగా ఓటిటి బాట పట్టేశారు . అదేదో ముందే చేసుకుంటే ఇంకా మంచి రేట్ తో పాటు రెస్పాన్స్ కూడా అదిరేదేమో.
This post was last modified on June 29, 2022 6:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…