మనదేశంలో ఉన్న టెలివిజన్లు 21 కోట్లేనని తాజా లెక్కల్లో తేలింది. దేశజనాభా 130 కోట్లన్న విషయం అందరికీ తెలిసిందే. జనాభా 130 కోట్లన్నమాటే కానీ కుటుంబాల సంఖ్య 30 కోట్లు. అంటే సగటును ఒక్కో కుటుంబంలో 4.5 సభ్యులున్నట్లు లెక్క. ఈ లెక్కలన్నీ ఏదో సర్వే సంస్ధ విడుదల చేసింది కాదు. బార్క్ అంటే బ్రాడ్ క్యాస్టింగ్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్ విడుదల చేసిన లెక్కలు కాబట్టి దాదాపు వాస్తవమే అని అనుకోవాలి.
దేశంలో ఎన్ని టీవీలున్నాయి, ఎంతమంది ప్రతిరోజు టీవీలు చూస్తున్నారు, ఏ కార్యక్రమాన్ని, ఏ సమయంలో ఎంతమంది చూస్తున్నారనే విషయాలపై బార్క్ ప్రతిరోజు వాచ్ చేస్తునే ఉంటుంది. ఇందుకోసం తనదైన పద్దతిలో ఏవో సాంకేతిక పరిజ్ఞాన్ని కూడా అనుసరిస్తోందిలేండి. సినిమాలు, సీరియళ్ళు, న్యూస్ ప్రోగ్రాములకైనా బార్క్ ఇచ్చే రేటింగ్స్ చాలా కీలకం. ఈ రేటింగ్స్ పై ఆధారపడే అనేక సంస్ధలు అడ్వర్టైజ్మెంట్లను ఇస్తుంటాయి.
ఇంతటి కీలకమైన పాత్ర పోషించే బార్క్ విడుదల చేసిన లెక్కల ప్రకారం టీవీ చూసే వ్యక్తుల సంఖ్య 89.2 కోట్లట. అంటే దేశజనాభా 130 కోట్లున్నా టీవీలు చూసే జనాభా మాత్రం 89 కోట్లేనంటే ఆశ్చర్యంగానే ఉంది. తాజా లెక్కల ప్రకారం టీవీలకు ఇంకా మనదేశంలో సుమారు 40 కోట్లమంది దూరంగా ఉన్నారంటే నమ్మకం కలగటంలేదు.
గడచిన ఏడాది కారణంగా కరోనా వైరస్ భయంతో దేశంలోని చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు. ఈ కారణం వల్లే టీవీలు చూసే వారి సంఖ్య 6.7 శాతం పెరిగిందట. లేకపోతే ఈ సంఖ్య కరోనాకు ముందు 83 కోట్లేనని బార్క్ చెప్పింది. ఇంకా 40 కోట్లమందికి టీవీలు చూసే భాగ్యం ఎప్పటికి దక్కుతుందో ఏమో. అయితే టీవీలు చూడలేకపోవటం వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయని మనస్తత్వశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
టీవీలు చూసే వాళ్ళల్లో ఉండే మనోవికారాలేవీ టీవీలు చూడని వాళ్ళలో దాదాపు ఉండవని నిపుణులు బల్లగుద్దకుండానే చెబుతున్నారు. మరి మిగిలిన వాళ్ళని కూడా టీవీలకు అలవాటు చేసి వాళ్ళ మానసిక వికారులను చేయటమా ? లేకపోతే వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వటమా అనేది తేల్చాలి.
This post was last modified on April 16, 2021 10:46 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…