Political News

షర్మిల దీక్ష సక్సెస్సా ? ఫెయిలా ?

ఇప్పుడిదే విషయం చాలామందికి అర్ధం కావటంలేదు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల 72 గంటల పాటు ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర సమస్యల నేపధ్యంలో పోలీసులు కేవలం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకే అనుమతించారు. సరే షర్మిల కూడా అనుమతి ప్రకారమే ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షచేశారు. వ్యక్తిగతంగా చూస్తే షర్మిల దీక్ష ఓకేనే.

కానీ ఆమె ఆశించినట్లు తెలంగాణాలోని వివిధ వర్గాల నుండి మద్దతు పెద్దగా వచ్చినట్లు కనబడలేదు. తన దీక్షకు మద్దతు ఇవ్వాలని, తనతో పాటు దీక్షలో కూర్చోవాలని ఆహ్వానిస్తు షర్మిల పేరు పేరునా చాలామందికి లేఖలు రాశారు. లేఖలు అందుకున్న వారిలో బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాత్రమే షర్మిలకు మద్దతుగా వేదిక దగ్గర కనిపించారు.

మరి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రజాసంఘాల నేతలు ఎవరు కూడా మద్దతుగా నిలిచినట్లు లేదు. ఒకవైపేమో వీళ్ళంతా కేసీయార్ ప్రభుత్వాన్ని నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. మరి ఇదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల చేసిన దీక్షకు వీళ్ళంతా ఎందుకు గైర్హాజరయ్యారు ? ఆహ్వానం లేదు కాబట్టి రాలేదని అనుకునేందుకు కూడా లేదు. ముందుగానే షర్మిల వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపారు.

ఆహ్వనాలు అందినా మద్దతుగా వేదిక దగ్గరకు రాలేదంటే షర్మిలను సీమాంధ్ర వ్యక్తిగానే వీళ్ళంతా పరిగణిస్తున్నారా ? సీమాంధ్ర వ్యక్తితో చేతులు కలపటం ఇష్టంలేకే వీరంతా ఆమెకు దూరంగా ఉన్నారా అనే డౌటు పెరిగిపోతోంది. ఏదేమైనా, ఎవరేమనుకున్నా తాను అనుకున్న ప్రకారం షర్మిల అయితే ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేశారు. మరింతకీ షర్మిల దీక్ష సక్సెస్ అయినట్లా ? లేకపోతే ఫెయిలయ్యిందా ? అన్నదే అర్ధంకాలేదు.

This post was last modified on April 16, 2021 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

29 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

52 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

1 hour ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago