దేశీయంగా వ్యాపార దిగ్గజాలు చాలామందే ఉండొచ్చు. ఇటీవల కాలంలో ఎవరికి రానంత పేరు వచ్చింది సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా. కరోనా ముందు వరకు కొందరికి మాత్రమే పరిచయమైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ (కోవీ షీల్డ్) తయారీ నేపథ్యంలో ఆయన పేరు సామాన్యుడికి సైతం సుపరిచితమైంది. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇందుకు కారణం ఆయన ఇంటి అద్దె కోసం పెడుతున్న భారీ మొత్తమే. సాధారణం ఒక సామాన్యుడి జీవితంలో కోటి రూపాయిల ఆదాయం అన్నది కలే. కోటి సంపాదించి పెడితే.. తన జీవితానికి ఒక సార్థకత వచ్చినట్లే అన్న భావన వ్యక్తమవుతూ ఉంటుంది.
అలాంటి కోటి మొత్తాన్ని కేవలం రెండు వారాల ఇంటి అద్దె కోసం ఖర్చు చేయటం మాటలా? అది కూడా తన విదేశీ ప్రయాణాల సమయంలో ఉండేందుకు కావటం మరో విశేషం. లండన్ లోని అత్యంత ఖరీదైన మేఫెయిర్ లోని ఒక విలాసవంతమైన భవనాన్ని ఆయన ఇటీవల లీజుకు తీసుకున్నాడు. దానికి వారానికి అద్దె కేవలం రూ.50లక్షలు మాత్రమే. అంటే నెలకు రూ.2 కోట్లు అన్న మాట. దీనికి సంబంధించి ప్రముఖ బిలియనీర్ డొమినికా కల్క్ జిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
నెలకు రూ.2కోట్ల మొత్తాన్ని అద్దెకు ఇచ్చే ఈ ఇల్లు ఎంత ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. ఇందులోనే ఒక గెస్ట్ హౌస్ తో పాటు.. కనువిందు చేసే ఉద్యానవనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. భారీ మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించటం ద్వారా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా మారారు.
This post was last modified on March 25, 2021 3:29 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…