దేశీయంగా వ్యాపార దిగ్గజాలు చాలామందే ఉండొచ్చు. ఇటీవల కాలంలో ఎవరికి రానంత పేరు వచ్చింది సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా. కరోనా ముందు వరకు కొందరికి మాత్రమే పరిచయమైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ (కోవీ షీల్డ్) తయారీ నేపథ్యంలో ఆయన పేరు సామాన్యుడికి సైతం సుపరిచితమైంది. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇందుకు కారణం ఆయన ఇంటి అద్దె కోసం పెడుతున్న భారీ మొత్తమే. సాధారణం ఒక సామాన్యుడి జీవితంలో కోటి రూపాయిల ఆదాయం అన్నది కలే. కోటి సంపాదించి పెడితే.. తన జీవితానికి ఒక సార్థకత వచ్చినట్లే అన్న భావన వ్యక్తమవుతూ ఉంటుంది.
అలాంటి కోటి మొత్తాన్ని కేవలం రెండు వారాల ఇంటి అద్దె కోసం ఖర్చు చేయటం మాటలా? అది కూడా తన విదేశీ ప్రయాణాల సమయంలో ఉండేందుకు కావటం మరో విశేషం. లండన్ లోని అత్యంత ఖరీదైన మేఫెయిర్ లోని ఒక విలాసవంతమైన భవనాన్ని ఆయన ఇటీవల లీజుకు తీసుకున్నాడు. దానికి వారానికి అద్దె కేవలం రూ.50లక్షలు మాత్రమే. అంటే నెలకు రూ.2 కోట్లు అన్న మాట. దీనికి సంబంధించి ప్రముఖ బిలియనీర్ డొమినికా కల్క్ జిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
నెలకు రూ.2కోట్ల మొత్తాన్ని అద్దెకు ఇచ్చే ఈ ఇల్లు ఎంత ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. ఇందులోనే ఒక గెస్ట్ హౌస్ తో పాటు.. కనువిందు చేసే ఉద్యానవనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. భారీ మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించటం ద్వారా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా మారారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…