Trends

పెళ్లి పేరు చెప్పి రూ.11 కోట్లు కొట్టేసిన కిలేడీ

చూసినంతనే ఆకట్టుకునే రూపం. దానికి తగ్గట్లు ఆహార్యం.. స్టైల్ గా ఉండే ఆమె చేసిన మోసం గురించి తెలిసిన పోలీసులు సైతం షాక్ తింటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటమే కాదు.. ఒక వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు నాకించేసిన వైనం సంచలనంగా మారింది.
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా.. తనను తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటుంది. నకిలీ ముసుగు వేసుకొని.. తన మాటలతో బోల్తా కొట్టించే ఆమెకు వీరారెడ్డి అనే వ్యాపారి అడ్డంగా బుక్ అయ్యారు.

పరిచయం.. పెళ్లి చేసుకోవాలన్న కమిట్ మెంట్ పేరుతో సదరు వ్యాపారి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు నాకించేసింది. తర్వాత హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె అసలు ఐపీఎస్ అధికారిణే కాదన్న విషయాన్ని తెలుసుకున్న సదరు వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సాయం చేసే మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

ఆమె వద్ద నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తులు.. డెబిట్ కార్డులు.. ఖరీదైన కార్లు.. విల్లాను స్వాధీనం చేసుకున్నారు. అయినా.. వెనుకా ముందు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటామనే మహిళకు రూ.11 కోట్లు ధారాదత్తం చేయటమా? అని అవాక్కు అవుతున్నారు. పెళ్లి అన్నంతనే.. ఎంత కట్నం అనటం మానేసి.. అమ్మాయికి ఎదురు డబ్బులు ఇచ్చే తీరు ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తుంది.

This post was last modified on February 24, 2021 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago