పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పెంచుకుంటాయి. ఒక్కొక్కసారి యజమానులు మృతి చెందిన సందర్భంలో పెంపుడు జంతువులు కూడా నిద్రాహారాలు మానేసి ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. అయితే.. దీనికి భిన్నంగా తాజాగా ఓ పెంపుడు పిల్లి మృతి చెందిందన్న దిగులుతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోనే చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లోని ఓ హాస్టల్ లో ఉంటూ.. డిగ్రీ చదువుతోంది. ఆమెకు తోడు.. ఓ పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లిని గారాబంగా చూసుకునేది. ఇటీవల ఆ పిల్లి.. అనారోగ్యానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో సదరు విద్యార్థిని దిగులు పెట్టుకుని.. తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటినుంచి ఆ విద్యార్థిని కాలేజీకి కూడా వెళ్లకుండా హాస్టల్ గదిలో ఒంటరిగా ఉండడం ప్రారంభించింది.
అప్పటి వరకు ఫ్రెండ్స్తో కలివిడిగా ఉన్న ఆమె.. పిల్లి మరణం తర్వాత.. ఎవరితోనూ కలవడం మానేసింది. అంతేకాదు.. బుధవారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాయంత్రం తిరిగి వచ్చిన విద్యార్థినులు హాస్టల్ గదిలో విద్యార్థిని రూమ్ లో నుంచి ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అనుమానం వచ్చి.. తలుపులు తెరిచి చూశారు.
ఫ్యాన్కు వేలాడుతున్న విద్యార్థిని చూసి అందరూ ఖిన్నులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. బాడీని కిందికి దింపారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. కేవలం పిల్లిపై పెంచుకున్న మమకారంతోనే విద్యార్థిని తీవ్ర ఆవేదనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా.. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు జంతువులపై ప్రాణాలు పెట్టుకోవడం మంచిదేనని.. కానీ, ఇలా ఆత్మహత్య చేసుకోవడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
This post was last modified on March 19, 2026 9:50 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…