Trends

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు వేరు.. ఘటనలు వేరు. కానీ రెండు సంఘటనల వెనుక కనిపిస్తున్న ప్రధాన కారణాలు మాత్రం కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, నిరాశ. ఒకే రోజున వెలుగుచూసిన ఈ రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి.

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నలుగురి మృతిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా? ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

అదే సమయంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, తరచూ జరుగుతున్న గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రెండు ఘటనలు వేర్వేరు పరిస్థితుల్లో జరిగినప్పటికీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. కుటుంబాల్లో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, దాంపత్య విభేదాలు చివరకు ప్రాణాలను బలితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ విషాదాల్లో బలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులను కూడా బలిచేయడం ప్రమాదకర ధోరణిగా మారుతోంది. ప్రకాశం, పల్నాడు ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్న విషయం ఒక్కటే.. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఆత్మహత్య కాదు. ఒక క్షణిక నిర్ణయం నాలుగు ప్రాణాలను బలితీస్తుంది.. అనేక కుటుంబాలను జీవితాంతం విషాదంలో ముంచేస్తుంది.

Kumar

Recent Posts

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

3 minutes ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

18 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

1 hour ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

2 hours ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

2 hours ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago