Trends

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు వేరు.. ఘటనలు వేరు. కానీ రెండు సంఘటనల వెనుక కనిపిస్తున్న ప్రధాన కారణాలు మాత్రం కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, నిరాశ. ఒకే రోజున వెలుగుచూసిన ఈ రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి.

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నలుగురి మృతిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా? ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

అదే సమయంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, తరచూ జరుగుతున్న గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రెండు ఘటనలు వేర్వేరు పరిస్థితుల్లో జరిగినప్పటికీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. కుటుంబాల్లో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, దాంపత్య విభేదాలు చివరకు ప్రాణాలను బలితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ విషాదాల్లో బలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులను కూడా బలిచేయడం ప్రమాదకర ధోరణిగా మారుతోంది. ప్రకాశం, పల్నాడు ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్న విషయం ఒక్కటే.. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఆత్మహత్య కాదు. ఒక క్షణిక నిర్ణయం నాలుగు ప్రాణాలను బలితీస్తుంది.. అనేక కుటుంబాలను జీవితాంతం విషాదంలో ముంచేస్తుంది.

This post was last modified on July 14, 2026 11:13 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

8 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

8 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

8 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

12 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

12 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

12 hours ago