సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగిన వాళ్లే. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిన వాళ్లే. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడని ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు చెబుతూనే ఉంటారు.
రూం మేట్స్గా ఉంటూ త్రివిక్రమ్, తాను పడ్డ ఇబ్బందుల గురించి సునీల్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. అంతకంటే ముందు అసిస్టెంట్ రైటర్గా అవకాశం కోసం త్రివిక్రమ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ రైటర్ పోసాని కృష్ణమురళి వెల్లడించారు. త్రివిక్రమ్ కోసం కమెడియన్ గౌతం రాజు.. తన బ్రాస్లెట్ను తాకట్టు పెట్టి మరీ డబ్బులు సాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘నేను రైటర్గా మంచి స్థాయిలో ఉన్నపుడు త్రివిక్రమ్ అవకాశం కోసం మా ఇంటికి వచ్చేవాడు. కానీ నేను ఉదయం ఐదున్నర ఆరు గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయేవాడిని. అతను తర్వాత వచ్చి మా ఆవిడను కలిసేవాడు. నా పేరు ఆకెళ్ళ శ్రీనివాస్, నేను సార్కి పెద్ద ఫ్యాన్, నాకు అసిస్టెంట్ రైటర్గా ఛాన్స్ ఇప్పించండి అని అడిగేవాడు. మా ఆవిడ తర్వాత నాకు తన గురించి చెప్పి, అతడికి ఎస్ ఆర్ నో చెప్పండి అనేది. కానీ ఆ కుర్రాడి గురించి నాకు ఏమీ తెలియదు, అసలు నన్ను కలవకుండానే ఏం చెప్పను అనేవాడిని.
తర్వాత శ్రీనివాస్ గురించి కమెడియన్ గౌతం రాజు నాకు చెప్పాడు. పేదవాడు, డబ్బులు లేవు అని చెబుతుంటే.. అవన్నీ కాదు, మంచివాడా కాదా అని అడిగితే మంచివాడన్నాడు. నేను మద్రాసుకు వెళ్తున్నా, పది పదిహేను రోజులు అక్కడే ఉంటాను. అక్కడికి పంపించు అన్నాను. ఆ విషయం గౌతం రాజు.. త్రివిక్రమ్కు చెబితే మద్రాసు వెళ్లడానికి డబ్బులు లేవన్నాడు. దీంతో తన చేతికున్న బ్రేస్లెట్ తీసి ఒక మార్వాడీ కొట్టులో వెయ్యి రూపాయలకు తాకట్టు పెట్టి ఆ డబ్బులిచ్చి త్రివిక్రమ్ను మద్రాసుకు పంపించాడు’’ అని పోసాని వెల్లడించారు.
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…