Trends

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చివరికి స్మశాన వాటికల అభివృద్దిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్న తీరు నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. ఓ స్మశాన వాటిక అబివృద్ధి పనుల్లోనూ లంచం ఇస్తే తప్పించి బిల్లులు మంజూరు చేయలేనని చెప్పిన ఓ అధికారి తాజాగా పట్టుబడ్డాడు. 

పెద్పల్లి జిల్లాలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. ఈయన గారు చేసిన ఘనకార్యం ఏమిటన్న విషయానికి వస్తే..మునిసిపాలిటీ పరిధిలో ఓ స్మశాన వాటికను రూ.12.28 లక్షల విలువైన పనులు జరగగా… ఆ బిల్లులు మంజూరు చేయాలంటే తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని భీష్మించారట. ఇతర ప్రాజెక్టులు అయితే ఏమోలే అనుకోవచ్చు…చివరాఖరుకు స్మశానాలను కూడా వదలరా? అన్న భావనతో పనులు చేసిన కాంట్రాక్టరు ఆయన తీరుపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

కాంట్రాక్టరు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడి అనంతరం ఏసీబీ అధికారులు నేరుగా ఏఈ గారి ఇంటిలో సోదాలు చేయగా… జమా లెక్కలు లేని రూ.32.31 లక్షల నగదు కూడా పట్టుబడిందట. వెరసి ఈ ఏఈ గారు పని ఏమిటన్న విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా… తాను అనుకుంటున్నట్లుగా రెండు చేతులా సంపాదించుకుంటూ సాగుతూ… స్మశానం లంచంతోనే పట్టుబడిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

This post was last modified on July 14, 2026 3:36 pm

Share

Recent Posts

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

1 hour ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

1 hour ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

2 hours ago

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

2 hours ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

2 hours ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

5 hours ago