అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చివరికి స్మశాన వాటికల అభివృద్దిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్న తీరు నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. ఓ స్మశాన వాటిక అబివృద్ధి పనుల్లోనూ లంచం ఇస్తే తప్పించి బిల్లులు మంజూరు చేయలేనని చెప్పిన ఓ అధికారి తాజాగా పట్టుబడ్డాడు.
పెద్పల్లి జిల్లాలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. ఈయన గారు చేసిన ఘనకార్యం ఏమిటన్న విషయానికి వస్తే..మునిసిపాలిటీ పరిధిలో ఓ స్మశాన వాటికను రూ.12.28 లక్షల విలువైన పనులు జరగగా… ఆ బిల్లులు మంజూరు చేయాలంటే తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని భీష్మించారట. ఇతర ప్రాజెక్టులు అయితే ఏమోలే అనుకోవచ్చు…చివరాఖరుకు స్మశానాలను కూడా వదలరా? అన్న భావనతో పనులు చేసిన కాంట్రాక్టరు ఆయన తీరుపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
కాంట్రాక్టరు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడి అనంతరం ఏసీబీ అధికారులు నేరుగా ఏఈ గారి ఇంటిలో సోదాలు చేయగా… జమా లెక్కలు లేని రూ.32.31 లక్షల నగదు కూడా పట్టుబడిందట. వెరసి ఈ ఏఈ గారు పని ఏమిటన్న విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా… తాను అనుకుంటున్నట్లుగా రెండు చేతులా సంపాదించుకుంటూ సాగుతూ… స్మశానం లంచంతోనే పట్టుబడిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on July 14, 2026 3:36 pm
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…