చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై పూజారి తిరుపతి వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.
రద్దీగా ఉండే రోడ్డుపై మైనర్ బాలిక చేతికి స్టీరింగ్ అప్పగించి డ్రైవింగ్ చేయించడం, దీనిని ప్రశ్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగడం, అనంతరం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు శాఖ సీరియస్గా స్పందించింది. ఎస్సైను సస్పెండ్ చేయడమే కాకుండా శాఖాపర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
స్థానికుల కథనం ప్రకారం, ఎస్సై తన మనవరాలిని డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి ప్రధాన రహదారిపై కారును నడిపించాడు. మైనర్కు కారు ఎలా ఇస్తారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించగా, “నేను పోలీస్ను… నా మనవరాలికి డ్రైవింగ్ నేర్పిస్తున్నా” అంటూ నిర్లక్ష్యంగా స్పందించినట్లు వీడియోల్లో కనిపించింది.
ఈ ఘటన కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీసు అధికారే ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. మైనర్కు కారు నడిపేందుకు అనుమతించినందుకు ఎస్సై పూజారి తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125తో పాటు మోటారు వాహనాల చట్టంలోని 184, 180 సెక్షన్ల కింద నర్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ను ఆదేశించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి శాఖాపర విచారణ చేపట్టాలని సూచించారు.
This post was last modified on July 13, 2026 11:31 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…