Trends

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆ దేశంలో విహార యాత్రకు వెళ్లిన 15 మంది భారతీయులు దుర్మరణం చెందారు. మరో 23 మంది క్షతగాత్రులుగా మిగిలారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటుగా తమిళనాడుకు చెందిన వారూ ఉన్నారు. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ లావా ఏర్పాటు చేసిన విహార యాత్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

లావా కంపెనీ తన వ్యాపార భాగస్వాములకు వియత్నాంలో విహార యాత్రను ఆపర్ చేసింది. ఆ సంస్థ మొబైల్ ఫోన్ల సేల్స్ లో సత్తా చాటిన పలువురు ఈ యాత్రకు ఎంపికయ్యారు. విహార యాత్రలో బాగంగా భారత్ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు.

యాత్రలో భాగంగా శనివారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 32 మందితొ పాటు మొత్తం 47 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో కలిసి సముద్రంలో విహారానికి వెళ్లిన స్పీడ్ బోటు నడి సంద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 23 మందిని సహాయక సిబ్బంది కాపాడగా… 15 మంద మృత్యువాత పడ్డారు. మరో 9 మంది గల్లంతయ్యారు.

మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరణించిన వారిలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జయశ్రీ భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక గల్లంతైన వారిలో ఏపీకి చెందిన మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

వియత్నాంలోని పు క్వాక్ లోని అన్ థోయ్ ద్వీపం సమీపంలో హోన్ మే రూట్ వద్ద స్పీడు బోటు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదానికి గురైన వారిలో  అత్యదికులు భారతీయులే కావడంతో అక్కడి భారత ఎంబసీ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది.

This post was last modified on July 11, 2026 6:38 pm

Share

Recent Posts

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

14 minutes ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

19 minutes ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

1 hour ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

3 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

4 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

5 hours ago