Trends

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆ దేశంలో విహార యాత్రకు వెళ్లిన 15 మంది భారతీయులు దుర్మరణం చెందారు. మరో 23 మంది క్షతగాత్రులుగా మిగిలారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటుగా తమిళనాడుకు చెందిన వారూ ఉన్నారు. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ లావా ఏర్పాటు చేసిన విహార యాత్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

లావా కంపెనీ తన వ్యాపార భాగస్వాములకు వియత్నాంలో విహార యాత్రను ఆపర్ చేసింది. ఆ సంస్థ మొబైల్ ఫోన్ల సేల్స్ లో సత్తా చాటిన పలువురు ఈ యాత్రకు ఎంపికయ్యారు. విహార యాత్రలో బాగంగా భారత్ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు.

యాత్రలో భాగంగా శనివారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 32 మందితొ పాటు మొత్తం 47 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో కలిసి సముద్రంలో విహారానికి వెళ్లిన స్పీడ్ బోటు నడి సంద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 23 మందిని సహాయక సిబ్బంది కాపాడగా… 15 మంద మృత్యువాత పడ్డారు. మరో 9 మంది గల్లంతయ్యారు.

మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరణించిన వారిలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జయశ్రీ భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక గల్లంతైన వారిలో ఏపీకి చెందిన మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

వియత్నాంలోని పు క్వాక్ లోని అన్ థోయ్ ద్వీపం సమీపంలో హోన్ మే రూట్ వద్ద స్పీడు బోటు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదానికి గురైన వారిలో  అత్యదికులు భారతీయులే కావడంతో అక్కడి భారత ఎంబసీ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది.

Kumar

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

27 minutes ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

45 minutes ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

3 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

3 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

3 hours ago

హాట్ టాపిక్… OTT సెన్సార్ వస్తే మంచిదే

ఇటీవలే జీ ఫైవ్ లో నేరుగా విడుదలైన సట్లెజ్ సినిమా రెండు రోజుల తర్వాత తీసేయాల్సి రావడం మీద మీడియా,…

3 hours ago