మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ అనే పాతికేళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని అందరూ భావించారు. తన పుట్టినరోజు వేడుకల కోసం కాబోయే భర్తతో కలిసి అక్కడికి వెళ్లానని, ఫొటోలు తీస్తుండగా కాలు జారి పడిపోయాడని అతని ప్రియురాలు సియా గోయల్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అనుమానం వచ్చిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది. సంఘటన జరిగిన రోజు ఉదయం ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీలు ఉంది. అంతటి ఎండలో కూడా కొండ కింది భాగంలో ఒక వ్యక్తి తలకు హుడీ వేసుకుని, చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండటం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఎండకు అలాంటి బట్టలు వేసుకోవడం పోలీసులకు అనుమానం తెప్పించింది. ఆ వ్యక్తిని చేతన్ చౌదరిగా గుర్తించి విచారించడంతో ఈ హత్య వెనుక ఉన్న చీకటి కోణం బయటపడింది.
పోలీసుల విచారణలో సియా, చేతన్ ఇద్దరూ గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తేలింది. అయితే కేతన్తో సియాకు గత ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం జరిగింది. నవంబర్ నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో దాదాపు పద్నాలుగు కోట్ల బడ్జెట్తో అత్యంత ఘనంగా పెళ్లి చేయడానికి పెద్దలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ తన ప్రియుడిని వదులుకోవడం ఇష్టం లేని సియా, ఎలాగైనా కేతన్ను అడ్డుతొలగించుకోవాలని ఒక పక్కా ప్లాన్ వేసింది. అందుకోసమే పుట్టినరోజు పేరుతో అతన్ని ట్రెకింగ్కు తీసుకెళ్లింది.
ప్లాన్ ప్రకారం చేతన్ తన మొబైల్ ఫోన్ను ఇంట్లోనే వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా కోట దగ్గరికి చేరుకున్నాడు. కేతన్, సియా ఇద్దరూ జనం లేని ఒంటరి ప్రదేశానికి వెళ్లగానే.. అక్కడే నక్కి ఉన్న చేతన్ తో కలిసి ఆమె కాబోయే భర్తను కింద ఉన్న లోయలోకి తోసేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొరికిపోకూడదనే ఉద్దేశంతోనే చేతన్ ఫోన్ తీసుకురాలేదని విచారణలో ఒప్పుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ట్రెక్కర్ అయిన కేతన్ కాలుజారి పడిపోయాడనే వాదనను పోలీసులు మొదటి పరిగణనలోకి తీసుకోకపోవడమే ఈ కుట్రను బయటపెట్టింది.
ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, కేతన్ను చంపడానికి ఇది రెండో ప్రయత్నం. సరిగ్గా నాలుగు రోజుల ముందు కూడా ఇదే కోట దగ్గర అతన్ని లోయలోకి తోసేయడానికి సియా ప్రయత్నించింది. కానీ అప్పట్లో పాము కనపడితే భయంతో పక్కకు నెట్టేశానని చెప్పి నమ్మించింది. ఆ మాటలు నిజమే అని నమ్మిన ఆ అమాయకుడు చివరికి ఆమె చేతిలోనే ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…