Trends

నీట్ పరీక్ష రాయాలంటే అబుదాబీకి వెళ్లాలా?

నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రాయబోతున్న నాగ్‌పూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా తాలిబ్ అనే విద్యార్థికి పరీక్షా కేంద్రంగా అబుదాబీలోని ఒక పాఠశాలను కేటాయించారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ విషయం తెలిసి విద్యార్థి కుటుంబం షాక్‌కు గురైంది.

విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం అడ్మిట్ కార్డు చూసినప్పుడు అబుదాబీలోని పాఠశాల పరీక్షా కేంద్రంగా కనిపించిందన్నారు. తాము దరఖాస్తులో అలాంటి ఎంపిక చేయలేదని చెప్పారు.

వెంటనే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగా ఈ-మెయిల్ పంపాలని సూచించారని తెలిపారు. ఈ-మెయిల్ పంపిన తర్వాత శనివారం సాయంత్రం 4 గంటలలోపు కొత్త అడ్మిట్ కార్డు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

దరఖాస్తు సమయంలో మూడు జిల్లాలను మాత్రమే ఎంపిక చేశామని, ఇప్పుడు నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రం ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ఇతర జిల్లాలకు వెళ్లేందుకు కూడా సమయం లేదన్నారు.
అడ్మిట్ కార్డులో విదేశీ కేంద్రం రావడంతో తమ కుమారుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, పరీక్ష రాయనని కూడా అన్నాడని తండ్రి తెలిపారు. అయితే అతని తల్లి ధైర్యం చెప్పడంతో పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నాడన్నారు.

“మా కుమారుడికి పాస్‌పోర్ట్ కూడా లేదు. అలాంటప్పుడు అబుదాబీలో కేంద్రం ఎలా కేటాయించారో అర్థం కావడం లేదు” అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త అడ్మిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

Kumar

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago