మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్ ఫోన్ను వినియోగిస్తున్నారని.. ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ వాడకం పెరిగిందని కూడా ఈ సర్వే పేర్కొంది. అయితే.. ఎన్ని కంపెనీల మొబై ల్ ఫోన్లు ఉన్నా.. ఎన్ని ఫీచర్లు అందిస్తున్నా.. అందరినీ ఎంతో ముగ్ధులను చేసేవి.. ఐ-ఫోన్లు. ఈ ఐ-ఫోన్లో ఉండే భద్రతా ఫీచర్లు.. ఇతరకారణాలే దీనికి ఆ స్థాయిని తీసుకువచ్చాయి.
అంతేకాదు.. ఐఫోన్ అనేది.. వ్యక్తుల హుందాతనానికి, సమాజంలో గౌరవానికి కూడా చిహ్నంగా మారిపోయింది. దీంతో ఇటీవల కాలంలో ఐ-ఫోన్ వినియోగదారులు పెరిగాయి. విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐ-ఫోన్-18 సిరీస్ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి షేర్ కూడా కలిగి ఉండడం గమనార్హం. కాగా.. తాజాగా ఈ కంపెనీ సీఈవో టిమ్ కుక్.. కీలక ప్రకటన చేశారు.
ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యానికి తోడు.. ఐఫోన్లో వినియోగించే అత్యంత భద్రతా పరమైన చిప్లకు కొరత ఏర్పడిందని తెలిపారు. దీంతో ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ ధరలు సిరీస్ 18ను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన చూచాయగానే ఈ విషయం చెప్పినా.. ధరలు పెరగడం ఖాయమని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఐఫోన్-17 వెర్షన్ 150000 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, అక్కడి నుంచి రూ.2 లక్షల వరకు కూడా పలుకుతున్నాయి. ఇక, 18 వెర్షన్.. కనిష్ఠ ధర 180000 రుపాయల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. దీనికి మరోకారణం కూడా ఉంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఐఫోన్లపై సుంకాలను భారీగా పెంచింది. అమెరికా బ్రాండ్విలువ పెంపులో భాగంగా సుంకాలను పెంచడంతో ఆ భారం కూడా.. 18 వెర్షన్పై పడనుందని అంటున్నారు.
This post was last modified on June 18, 2026 2:40 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…