ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా స్టీల్ ప్లాంట్ లో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ మంటలను చూసిన కార్మికులు, స్లీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదం ఏపీలో ఒక్కసారిగా భయాందోళనలను రేపింది. పెద్దగా ప్రమాదాలు లేకుండానే కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక్కసారిగా 8 మందిని పొట్టనబెట్టుకున్న యాక్సిడెంట్ జరిగిన తీరును చూసి జనం భయానికి గురయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతోందన్న భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జనం.. ఆ సంస్థలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యారని చెప్పక తప్పదు.
ఈ ప్రమాదానికి గల కారణాల విషయానికి వస్తే… విశాఖ స్లీల్ ప్లాంట్ లో ముడి ఖనిజం నుంచి ఉక్కును తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ద్రవ ఉక్కును పైకి ఎత్తుతున్న సమయంలో… ఓ భారీ బకెట్ నుంచి ఉక్కు ద్రవం లీకై కింద పడిపోయింది. అసలే వందల డిగ్రీల ఉష్టోగ్రతలతో ఉన్న ద్రవ ఉక్కు దేనిపై పడినా అది భస్మం కాక తప్పదు. ఈ ప్రమాదంలోనూ అదే జరిగింది. ఉక్కు ద్రవాన్ని పైకి ఎత్తిపోస్తున్న సమయంలో ఆ బెకెట్ లోని ద్రవం లీకైంది. ఆ ద్రవ ఉక్కు పడిన కారణంగా అక్కడ ఉన్న బారీ క్రేన్ అక్కడికక్కడే బుగ్గి అయ్యిందట.
ఈ ప్రమాదంలో ఉక్కు ద్రవం పడిన ప్రాంతమంతా అదిక వేడితో నిండిపోయింది. ఈ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం. అసలు ఉక్కు ద్రవాన్ని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఉక్కు ద్రవం మనిషి మీడ పడితే మాడిపోక తప్పదు. భారీ క్రేన్ నే దహించి వేసిన ఉక్కు ద్రవం 8 మంది కార్మికులను కూడా పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన ఉక్కు ద్రవం లీక్ కావడానికి గల కారణాలేమిటన్న విషయం తేలాల్సి ఉంది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…