బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక స్థిరత్వం తెచ్చుకుని, తర్వాత భాగస్వామికి టాటా చెప్పేస్తుంటారు. ఇలాంటి వాళ్లను గోల్డ్ డిగ్గర్స్ అంటుంటారు.
సుస్మితా సేన్ కూడా ఈ కోవకు చెందిందే అంటూ ఆమె మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ మాజీ విశ్వసుందరికి 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. గతంలో బాలీవుడ్లో కొన్ని రిలేషన్షిప్స్లో ఉన్న సుస్మిత.. తర్వాత సింగిల్గానే కొనసాగింది.
ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేస్తున్న సుస్మిత.. కొన్నేళ్ల ముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడింది. లేటు వయసులో వీళ్లిద్దరూ డేటింగ్ చేయడం మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న టైంలో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కేసులు ఎదుర్కొని లండన్కు వెళ్లిపోయిన మోడీ.. కేసుల భయంతో అక్కడే సెటిలైపోయాడు. తిరిగి ఇండియాకు రాలేదు.
సుస్మిత లండన్కే వెళ్లి కొన్నేళ్లు లలిత్తో ఉండి, ఈ మధ్య ఆయనకు టాటా చెప్పేసి వచ్చేసింది. ఐతే లలిత్ దగ్గర డబ్బులు దండుకుని ఇండియాకు వచ్చేసిందంటూ ఆమెపై ‘గోల్డ్ డిగ్గర్’ అని ముద్ర వేసి విమర్శలు చేస్తున్నారు.
దీనిపై లలిత్ మోడీ తాజాగా స్పందించాడు. సుస్మితపై విమర్శలు అర్థరహితమని, ఆమె తన దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశాడు.
‘‘సుస్మిత నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, ఎదగడానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం. సుస్మిత కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గర ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. ఆమె వాటన్నంటినీ తన కష్టంతో సంపాదించుకుంది.
సుస్మితకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మేం కలిసి ఉన్న సమయంలో బయటికి వెళ్తే నేను దేనికీ డబ్బులు చెల్లించేవాడిని కాదు. ఆమెనే అన్నింటికీ డబ్బులు కట్టేది. నేనే ఆమె డబ్బుల మీద ఆధారపడ్డాను తప్ప.. నా డబ్బు ఆమె తీసుకోలేదు. ఎవరి దగ్గరా ఏదీ ఆశించడానికి ఆమె ఇష్టపడదు. తన గురించి తెలియన వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు’’ అంటూ సుస్మితకు సర్టిఫికెట్ ఇచ్చాడు లలిత్ మోడీ.
This post was last modified on June 2, 2026 2:42 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…