బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక స్థిరత్వం తెచ్చుకుని, తర్వాత భాగస్వామికి టాటా చెప్పేస్తుంటారు. ఇలాంటి వాళ్లను గోల్డ్ డిగ్గర్స్ అంటుంటారు.
సుస్మితా సేన్ కూడా ఈ కోవకు చెందిందే అంటూ ఆమె మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ మాజీ విశ్వసుందరికి 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. గతంలో బాలీవుడ్లో కొన్ని రిలేషన్షిప్స్లో ఉన్న సుస్మిత.. తర్వాత సింగిల్గానే కొనసాగింది.
ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేస్తున్న సుస్మిత.. కొన్నేళ్ల ముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడింది. లేటు వయసులో వీళ్లిద్దరూ డేటింగ్ చేయడం మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న టైంలో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కేసులు ఎదుర్కొని లండన్కు వెళ్లిపోయిన మోడీ.. కేసుల భయంతో అక్కడే సెటిలైపోయాడు. తిరిగి ఇండియాకు రాలేదు.
సుస్మిత లండన్కే వెళ్లి కొన్నేళ్లు లలిత్తో ఉండి, ఈ మధ్య ఆయనకు టాటా చెప్పేసి వచ్చేసింది. ఐతే లలిత్ దగ్గర డబ్బులు దండుకుని ఇండియాకు వచ్చేసిందంటూ ఆమెపై ‘గోల్డ్ డిగ్గర్’ అని ముద్ర వేసి విమర్శలు చేస్తున్నారు.
దీనిపై లలిత్ మోడీ తాజాగా స్పందించాడు. సుస్మితపై విమర్శలు అర్థరహితమని, ఆమె తన దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశాడు.
‘‘సుస్మిత నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, ఎదగడానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం. సుస్మిత కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గర ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. ఆమె వాటన్నంటినీ తన కష్టంతో సంపాదించుకుంది.
సుస్మితకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మేం కలిసి ఉన్న సమయంలో బయటికి వెళ్తే నేను దేనికీ డబ్బులు చెల్లించేవాడిని కాదు. ఆమెనే అన్నింటికీ డబ్బులు కట్టేది. నేనే ఆమె డబ్బుల మీద ఆధారపడ్డాను తప్ప.. నా డబ్బు ఆమె తీసుకోలేదు. ఎవరి దగ్గరా ఏదీ ఆశించడానికి ఆమె ఇష్టపడదు. తన గురించి తెలియన వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు’’ అంటూ సుస్మితకు సర్టిఫికెట్ ఇచ్చాడు లలిత్ మోడీ.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…