పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక, సమయానికి అనుమతులు రాక నిర్మాతలు టెన్షన్ పడుతుంటే, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి సారించలేక, కోర్టుల నుంచి హఠాత్తుగా వచ్చే అక్షింతలు భరించలేక అటు గవర్నమెంట్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయినా సరే అంతులేని కథలా ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పుడీ టాపిక్ కి కారణం పెద్ది అని వేరే చెప్పనక్కర్లేదు.
రేపు రాత్రి ప్రీమియర్లు వేయాలి. ఇప్పటిదాకా జీవో లేదు. నిర్మాత ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లేమో ఆల్రెడీ అమలులో ఉన్న గరిష్ట ధర ప్రకారం వెళ్ళిపోదామని అడుగుతున్నారు. మధ్యలో ఏ నిర్ణయం వెలువడటం లేదు. ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని టీమ్ నమ్మకంతో ఉండగా అంత ఈజీగా ఇది తేలదని బయ్యర్లు భావిస్తున్నారు. ఆ మధ్య రాజా సాబ్ టైంలో ఎంత రాద్ధాంతం జరిగిందో తెలిసిందే. విమల్ థియేటర్ దగ్గర పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
త్వరలోనే ఈ ప్రక్రియకు సరైన దిశానిర్దేశం రావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. ఎందుకంటే టయర్ 1 హీరోలందరూ ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. విశ్వంభర, సంబరాల ఏటిగట్టు, వారణాసి, డ్రాగన్, రాకా, ప్యారడైజ్ లాంటివి వందల కోట్ల పెట్టుబడితో పెద్ద రిస్కు చేస్తున్నవి. ఇది దృష్టిలో పెట్టుకుని టికెట్ పెంపు వ్యవహారాన్ని సరళతరం చేయాలని సినీ పెద్దలు అడుగుతున్నారు. గద్దర్ అవార్డులు పునరుద్ధరించినట్టే ఈ సమస్యకు కూడా పరిష్కారం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
గతంలో హైకోర్టు ఒక ఆదేశమిచ్చింది. తొంభై రోజుల ముందే నిర్మాతలు హైక్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించాలని దాని సారాంశం. కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడటం లేదు. ఎందుకంటే చెప్పిన రిలీజ్ డేట్లకు కట్టుబడే పరిస్థితి ఏ నిర్మాతకు లేదు. పెద్ది నుంచి మా ఇంటి బంగారం లాంటి మీడియం బడ్జెట్ సినిమా దాకా అందరిదీ అదే పరిస్థితి. దీనికి ముగింపు దొరకాలంటే పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ నడుం బిగించాలి. లేదంటే స్టోరీ రిపీట్ అవుతూనే ఉంటుంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…