పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక, సమయానికి అనుమతులు రాక నిర్మాతలు టెన్షన్ పడుతుంటే, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి సారించలేక, కోర్టుల నుంచి హఠాత్తుగా వచ్చే అక్షింతలు భరించలేక అటు గవర్నమెంట్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయినా సరే అంతులేని కథలా ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పుడీ టాపిక్ కి కారణం పెద్ది అని వేరే చెప్పనక్కర్లేదు.
రేపు రాత్రి ప్రీమియర్లు వేయాలి. ఇప్పటిదాకా జీవో లేదు. నిర్మాత ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లేమో ఆల్రెడీ అమలులో ఉన్న గరిష్ట ధర ప్రకారం వెళ్ళిపోదామని అడుగుతున్నారు. మధ్యలో ఏ నిర్ణయం వెలువడటం లేదు. ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని టీమ్ నమ్మకంతో ఉండగా అంత ఈజీగా ఇది తేలదని బయ్యర్లు భావిస్తున్నారు. ఆ మధ్య రాజా సాబ్ టైంలో ఎంత రాద్ధాంతం జరిగిందో తెలిసిందే. విమల్ థియేటర్ దగ్గర పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
త్వరలోనే ఈ ప్రక్రియకు సరైన దిశానిర్దేశం రావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. ఎందుకంటే టయర్ 1 హీరోలందరూ ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. విశ్వంభర, సంబరాల ఏటిగట్టు, వారణాసి, డ్రాగన్, రాకా, ప్యారడైజ్ లాంటివి వందల కోట్ల పెట్టుబడితో పెద్ద రిస్కు చేస్తున్నవి. ఇది దృష్టిలో పెట్టుకుని టికెట్ పెంపు వ్యవహారాన్ని సరళతరం చేయాలని సినీ పెద్దలు అడుగుతున్నారు. గద్దర్ అవార్డులు పునరుద్ధరించినట్టే ఈ సమస్యకు కూడా పరిష్కారం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
గతంలో హైకోర్టు ఒక ఆదేశమిచ్చింది. తొంభై రోజుల ముందే నిర్మాతలు హైక్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించాలని దాని సారాంశం. కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడటం లేదు. ఎందుకంటే చెప్పిన రిలీజ్ డేట్లకు కట్టుబడే పరిస్థితి ఏ నిర్మాతకు లేదు. పెద్ది నుంచి మా ఇంటి బంగారం లాంటి మీడియం బడ్జెట్ సినిమా దాకా అందరిదీ అదే పరిస్థితి. దీనికి ముగింపు దొరకాలంటే పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ నడుం బిగించాలి. లేదంటే స్టోరీ రిపీట్ అవుతూనే ఉంటుంది.
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…