ఈ రోజుల్లో సినిమాల్లో సందేశాలు ఇస్తే..ఎవరు తీసుకుంటారు? మంచి చూపిస్తే ఎవరు నేర్చుకుంటారు అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. అలాంటి సినిమాలకు ఆదరణ కూడా తక్కువగానే ఉంటుంది. కానీ సినిమాల్లో చూపించే చెడు తాలూకు ప్రభావం మాత్రం జనాల మీద చాలానే ఉంటుందని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. గత ఏడాది తెలుగులో సంచలన విజయం అందుకున్న చిత్రాల్లో రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. అందులో చూపించిన ఒక చెడు అంశం ( నిజంగానే జరిగిన ఘటన ).. ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేసింది.
తనకు ఇష్టం లేని కుర్రాడితో ప్రేమలో పడిందని హీరోయిన్కు హెచ్ఐవీ ఇంజక్షన్ చేసి ఆమెతో పాటు తన ప్రేమికుడి జీవితాన్నీ నాశనం చేస్తాడు ఆమె అన్న. ఆ సన్నివేశం చూసి ప్రేక్షకులు కదిలిపోయారు. అది నిజంగా ఒక గ్రామంలో జరిగిన ఘటనే కావడం గమనార్హం. ఈ సినిమా ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు దర్శకుడు సాయిలు. ఐతే ఈ సినిమా జనాలను మంచి దిశగా ఎంత మార్చిందో కానీ.. అందులో చూపించిన చెడు విషయం నుంచి స్ఫూర్తి పొందే వాళ్లు ఎక్కువైపోతున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి విడుదల తర్వాత ఇప్పటికే ఇలాంటి ఘటలను కొన్ని వార్తల్లోకి రావడం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఉదంతంలో ఒక ప్రాణం పోయింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెల మనోహర్ అనే వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతి హెచ్ఐవీ కలిసిన రక్తాన్ని ఎక్కించడం సంచలనం రేపింది. బాధిత యువతి ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
తనకు జరిగిన ఘోరం విషయంలో ఇన్నాళ్లూ ఓర్చుకున్న ఆ యువతి.. భవిష్యత్తును తలుచుకుని కుమిలిపోతూ చివరికి ప్రాణమే తీసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోతూ.. బాధ్యుడైన మనోహర్కు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మరి అతడికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.
This post was last modified on April 11, 2026 7:16 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…