ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు.
ఎన్నికల కమిషన్తో సమన్వయం, ఓటరు జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన వంటి అంశాలపై వేగం పెంచాలని ఆదేశించారు. కొత్త జనగణన పూర్తి కాకపోవడంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే సందర్భమని పేర్కొన్న సీఎం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పారదర్శకంగా, వివాదరహితంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక వినియోగం పెంచాలని, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అధికార పార్టీ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా, ప్రతిపక్షాలు తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక పరీక్షగా నిలవనున్నాయి.
ఈ రోజుల్లో పెద్ద సినిమాలకే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలాంటపుడు చిన్న స్థాయి సినిమాలను జనాల్లోకి…
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…