ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు.
ఎన్నికల కమిషన్తో సమన్వయం, ఓటరు జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన వంటి అంశాలపై వేగం పెంచాలని ఆదేశించారు. కొత్త జనగణన పూర్తి కాకపోవడంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే సందర్భమని పేర్కొన్న సీఎం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పారదర్శకంగా, వివాదరహితంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక వినియోగం పెంచాలని, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అధికార పార్టీ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా, ప్రతిపక్షాలు తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక పరీక్షగా నిలవనున్నాయి.
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…