ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు.
ఎన్నికల కమిషన్తో సమన్వయం, ఓటరు జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన వంటి అంశాలపై వేగం పెంచాలని ఆదేశించారు. కొత్త జనగణన పూర్తి కాకపోవడంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే సందర్భమని పేర్కొన్న సీఎం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పారదర్శకంగా, వివాదరహితంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక వినియోగం పెంచాలని, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అధికార పార్టీ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా, ప్రతిపక్షాలు తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక పరీక్షగా నిలవనున్నాయి.
This post was last modified on April 11, 2026 12:36 am
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం…
కొన్ని కొన్ని నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. దీంతో అలాంటి నిర్ణయాలపై ప్రజల్లో సహజంగానే సందేహాలు వస్తుంటాయి. ఫలితంగా ఆయా నిర్ణయాల…
పదమూడేళ్ల క్రితం ప్రకటించిన సినిమా ధృవ నచ్చతిరం. విక్రమ్ హీరోగా, పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా,…