Trends

బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పు.. ఖాతాదారుడికి వాతలు?

గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. రేపటి (బుధవారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026 ఏప్రిల్ 1- 2027 మార్చి 31) షురూ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

రిజర్వు బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల రూల్స్ ను సవరిస్తున్నాయి. ఏటీఎం కార్డు అవసరం లేకుండా.. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు విత్ డ్రా చేసే వెసులుబాటు బ్యాంక్ ఖాతాదారులకు ఫ్రీగా ఉండేది. లేదంటే అదనపు లావాదేవీగా వినియోగించుకునే వారు.

అందుకు భిన్నంగా ఏప్రిల్ 1 నుంచి పరిమితులు మొదలు కానున్నాయి. వివిధ బ్యాంకులు తమకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు విత్ డ్రాను.. నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీగా పరిగణించనున్నారు. ఉచిత లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత.. యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్ డ్రా మీదా రూ.23తో పాటు.. అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు వీుగా డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఓటీపీ మాత్రమే కాదకుండా పిన్ లేదంటే బయోమెట్రిక్ లాంటి అదనపు ధ్రువీకరణ తప్పనిసరి చేయనున్నారు.

దీంతో.. ఇప్పటివరకు ఉన్న సింగిల్ లైన్ సెక్యూరిటీకి భిన్నంగా డ్యూయల్ సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు.. యాప్ ల ద్వారా పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేస్తే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకులు పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అదే పనిగా బ్యాలెన్సుల్ని చెక్ చేసుకునే అలవాటు ఉంటే.. కాస్త మార్చుకోవటం మంచిది.

డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం నగదు విత్ డ్రాకు సంబంధించి పలు బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. నగదు విత్ డ్రా మొత్తాన్ని సగానికి తగ్గించింది. చాలా కార్డులకు రోజువారీ విత్ డ్రా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచిత ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితం.ఈ పరిమితి దాటితే.. ప్రతి లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

This post was last modified on March 31, 2026 9:21 am

Share

Recent Posts

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

12 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

49 minutes ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

1 hour ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

1 hour ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

2 hours ago