గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. రేపటి (బుధవారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026 ఏప్రిల్ 1- 2027 మార్చి 31) షురూ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
రిజర్వు బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల రూల్స్ ను సవరిస్తున్నాయి. ఏటీఎం కార్డు అవసరం లేకుండా.. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు విత్ డ్రా చేసే వెసులుబాటు బ్యాంక్ ఖాతాదారులకు ఫ్రీగా ఉండేది. లేదంటే అదనపు లావాదేవీగా వినియోగించుకునే వారు.
అందుకు భిన్నంగా ఏప్రిల్ 1 నుంచి పరిమితులు మొదలు కానున్నాయి. వివిధ బ్యాంకులు తమకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు విత్ డ్రాను.. నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీగా పరిగణించనున్నారు. ఉచిత లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత.. యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్ డ్రా మీదా రూ.23తో పాటు.. అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు వీుగా డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఓటీపీ మాత్రమే కాదకుండా పిన్ లేదంటే బయోమెట్రిక్ లాంటి అదనపు ధ్రువీకరణ తప్పనిసరి చేయనున్నారు.
దీంతో.. ఇప్పటివరకు ఉన్న సింగిల్ లైన్ సెక్యూరిటీకి భిన్నంగా డ్యూయల్ సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు.. యాప్ ల ద్వారా పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేస్తే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకులు పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అదే పనిగా బ్యాలెన్సుల్ని చెక్ చేసుకునే అలవాటు ఉంటే.. కాస్త మార్చుకోవటం మంచిది.
డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం నగదు విత్ డ్రాకు సంబంధించి పలు బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. నగదు విత్ డ్రా మొత్తాన్ని సగానికి తగ్గించింది. చాలా కార్డులకు రోజువారీ విత్ డ్రా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచిత ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితం.ఈ పరిమితి దాటితే.. ప్రతి లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…