Trends

టెన్షన్ లేకుండా ఓడిన CSK.. ఏంటో ఈ ఆట!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన బలహీనతలను బయటపెట్టుకుంది. బౌలింగ్‌లో పస లేదు, బ్యాటింగ్‌లో నిలకడ లేదు, ఫీల్డింగ్‌లో స్ఫూర్తి లేదు. అసలు ఎందుకు ఆడుతున్నామో అన్నట్లు.. ఏంటో ఈ ఆట అన్నట్లు మ్యాచ్ సాగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తన వ్యూహాలతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయగా అన్ని విభాగాల్లోనూ సీఎస్‌కే తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కేవలం 127 పరుగులకే కుప్పకూలింది.

ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే ఊదేసి, 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ​చెన్నై బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో అత్యంత నీరసంగా కనిపించింది. వరల్డ్ కప్ హీరో సంజూ శామ్సన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), భారీ హిట్టర్ శివం దూబే (6) వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక వేలంలో 14 కోట్లు పెట్టి కొనుక్కున్న కార్తీక్ శర్మ (18) కూడా దారుణంగా విఫలమయ్యాడు. 

వికెట్లు పడుతున్నా కనీసం క్రీజులో నిలబడి స్కోరును ముందుకు తీసుకెళ్దామనే కనీస తెగింపు ఏ బ్యాటర్‌లోనూ కనిపించలేదు. జేమీ ఓవర్టన్ (43) ఒక్కడే కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా బోర్డుపైకి చేరింది. రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కోవడంలో చెన్నై బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ​ఫీల్డింగ్ విషయంలో కూడా చెన్నై ఆటతీరు మరీ దారుణంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచే ఏదో నీరసంగా ఆడుతున్నట్లు అనిపించింది తప్ప, గెలవాలనే కసి ఎక్కడా కనిపించలేదు. 

ముఖ్యంగా ఇన్నింగ్స్ మొదట్లోనే వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను కార్తీక్ శర్మ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్న సూర్యవంశీ.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు. ఫీల్డర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అనవసరంగా పరుగులు ఇవ్వడం చెన్నై ఓటమిని వేగవంతం చేసింది. ​కెప్టెన్సీ పరంగా చూస్తే రుతురాజ్ గైక్వాడ్ పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఏమాత్రం ప్రయోగాలు చేయలేదు. 

రాజస్థాన్ ఓపెనర్లు సూర్యవంశీ (52), యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) విధ్వంసం సృష్టిస్తున్నా బౌలింగ్ మార్పుల్లో గైక్వాడ్ విఫలమయ్యాడు. అదే సమయంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ చెన్నై బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా చేశాడు. పరాగ్ వేసిన ప్లాన్లకు చెన్నై దగ్గర సమాధానమే లేకపోయింది. చివరికి పరాగ్ (14 నాటౌట్) స్వయంగా క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. ఇక చెన్నై పాత పద్ధతులను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో పుంజుకోకపోతే, ఈ సీజన్‌లో వారికి గడ్డు పరిస్థితులు తప్పవు.

Kumar

Recent Posts

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

54 seconds ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

7 minutes ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

21 minutes ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

1 hour ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

1 hour ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

4 hours ago