ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన బలహీనతలను బయటపెట్టుకుంది. బౌలింగ్లో పస లేదు, బ్యాటింగ్లో నిలకడ లేదు, ఫీల్డింగ్లో స్ఫూర్తి లేదు. అసలు ఎందుకు ఆడుతున్నామో అన్నట్లు.. ఏంటో ఈ ఆట అన్నట్లు మ్యాచ్ సాగింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తన వ్యూహాలతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయగా అన్ని విభాగాల్లోనూ సీఎస్కే తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కేవలం 127 పరుగులకే కుప్పకూలింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే ఊదేసి, 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. చెన్నై బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్లో అత్యంత నీరసంగా కనిపించింది. వరల్డ్ కప్ హీరో సంజూ శామ్సన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), భారీ హిట్టర్ శివం దూబే (6) వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితమై పెవిలియన్కు క్యూ కట్టారు. ఇక వేలంలో 14 కోట్లు పెట్టి కొనుక్కున్న కార్తీక్ శర్మ (18) కూడా దారుణంగా విఫలమయ్యాడు.
వికెట్లు పడుతున్నా కనీసం క్రీజులో నిలబడి స్కోరును ముందుకు తీసుకెళ్దామనే కనీస తెగింపు ఏ బ్యాటర్లోనూ కనిపించలేదు. జేమీ ఓవర్టన్ (43) ఒక్కడే కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా బోర్డుపైకి చేరింది. రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కోవడంలో చెన్నై బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఫీల్డింగ్ విషయంలో కూడా చెన్నై ఆటతీరు మరీ దారుణంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచే ఏదో నీరసంగా ఆడుతున్నట్లు అనిపించింది తప్ప, గెలవాలనే కసి ఎక్కడా కనిపించలేదు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ మొదట్లోనే వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్ను కార్తీక్ శర్మ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్న సూర్యవంశీ.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. ఫీల్డర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అనవసరంగా పరుగులు ఇవ్వడం చెన్నై ఓటమిని వేగవంతం చేసింది. కెప్టెన్సీ పరంగా చూస్తే రుతురాజ్ గైక్వాడ్ పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఏమాత్రం ప్రయోగాలు చేయలేదు.
రాజస్థాన్ ఓపెనర్లు సూర్యవంశీ (52), యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) విధ్వంసం సృష్టిస్తున్నా బౌలింగ్ మార్పుల్లో గైక్వాడ్ విఫలమయ్యాడు. అదే సమయంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ చెన్నై బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా చేశాడు. పరాగ్ వేసిన ప్లాన్లకు చెన్నై దగ్గర సమాధానమే లేకపోయింది. చివరికి పరాగ్ (14 నాటౌట్) స్వయంగా క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. ఇక చెన్నై పాత పద్ధతులను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో పుంజుకోకపోతే, ఈ సీజన్లో వారికి గడ్డు పరిస్థితులు తప్పవు.
This post was last modified on March 30, 2026 11:07 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…