ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్న బంకుల దగ్గర జనాలు బారులు తీరారు.
తమ వాహనాలతో కొంతమంది, కంటైనర్లలో డబ్బాలలో పెట్రోల్ ను నిల్వ చేసుకొని మరి కొంతమంది తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలకు ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం బంకులు మూతపడతాయి అన్న వదంతులతో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.
ఇదే విషయంపై వదంతులు నమ్మవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటన చేసినా ఫలితం లేదు. మరోవైపు అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని, రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పెట్రోలియం కంపెనీల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని ప్రకటన విడుదల చేసింది.
ప్రజలెవరూ కంగారు పడొద్దని, వదంతులు నమ్మవద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో మాదిరిగానే రోజువారి అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు
This post was last modified on March 25, 2026 11:14 am
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…