Trends

నెల రోజుల పసికందుకి ఆకలి మృతి

బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నెల రోజుల పసికందు ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. కన్నవారు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో దిక్కులేక ఆ పసిగుడ్డు కన్నుమూసింది. లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం, కనీసం తిండి కూడా లేక అడుక్కునే స్థితికి చేరుకోవడం ఈ విషాదానికి ప్రధాన కారణం.

మొహమ్మద్ షాదాబ్ అనే వ్యక్తి గతంలో గాలిపటాల మాంజా వ్యాపారంలో ఉండేవాడు. అయితే కోవిడ్ సమయంలో పనులు ఆగిపోవడంతో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా పని దొరకకపోవడంతో, చివరకు భార్య హీనాతో కలిసి అడుక్కునే దారి ఎంచుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా, అందరికంటే చిన్నదైన నెల రోజుల పాపను, మిగిలిన ఇద్దరు పిల్లల (నాలుగేళ్లు, ఏడాదిన్నర) వద్ద వదిలేసి దంపతులిద్దరూ శుక్రవారం ఉదయం భిక్షాటనకు వెళ్లారు.

రోజంతా బయట తిరిగి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారు ఇంటికి వచ్చేసరికి, నెల రోజుల పాప స్పృహ లేకుండా పడి ఉంది. కంగారుపడి చూడగా అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఇన్ఫెక్షన్, అనారోగ్యం కారణంగా మరణం సంభవించిందని తేలినా, పాలు కూడా లేని ఆకలి వల్లే పాప చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ కుటుంబానికి ఇలాంటి కష్టం రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీరి ఆరు నెలల బాబు ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించాడు. వరుస విషాదాలు వెంటాడుతున్నా, వారిని ఆదుకునే వారు లేకపోవడంతో ఆ దంపతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఆ పాప మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత, ఇంటి అద్దె కట్టలేక షాదాబ్ తన మిగిలిన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

3 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

6 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago