Trends

నెల రోజుల పసికందుకి ఆకలి మృతి

బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నెల రోజుల పసికందు ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. కన్నవారు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో దిక్కులేక ఆ పసిగుడ్డు కన్నుమూసింది. లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం, కనీసం తిండి కూడా లేక అడుక్కునే స్థితికి చేరుకోవడం ఈ విషాదానికి ప్రధాన కారణం.

మొహమ్మద్ షాదాబ్ అనే వ్యక్తి గతంలో గాలిపటాల మాంజా వ్యాపారంలో ఉండేవాడు. అయితే కోవిడ్ సమయంలో పనులు ఆగిపోవడంతో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా పని దొరకకపోవడంతో, చివరకు భార్య హీనాతో కలిసి అడుక్కునే దారి ఎంచుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా, అందరికంటే చిన్నదైన నెల రోజుల పాపను, మిగిలిన ఇద్దరు పిల్లల (నాలుగేళ్లు, ఏడాదిన్నర) వద్ద వదిలేసి దంపతులిద్దరూ శుక్రవారం ఉదయం భిక్షాటనకు వెళ్లారు.

రోజంతా బయట తిరిగి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారు ఇంటికి వచ్చేసరికి, నెల రోజుల పాప స్పృహ లేకుండా పడి ఉంది. కంగారుపడి చూడగా అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఇన్ఫెక్షన్, అనారోగ్యం కారణంగా మరణం సంభవించిందని తేలినా, పాలు కూడా లేని ఆకలి వల్లే పాప చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ కుటుంబానికి ఇలాంటి కష్టం రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీరి ఆరు నెలల బాబు ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించాడు. వరుస విషాదాలు వెంటాడుతున్నా, వారిని ఆదుకునే వారు లేకపోవడంతో ఆ దంపతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఆ పాప మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత, ఇంటి అద్దె కట్టలేక షాదాబ్ తన మిగిలిన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు.

This post was last modified on March 23, 2026 3:09 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago