తమిళంలో చాలా ఏళ్లు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉన్నాడు. రజినీ ఉండగా ఆయన్ని కొట్టే హీరో ఇంకొకరు రారనే అంతా అనుకున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు మారిపోయాయి. విజయ్.. రజినీని మించి పెద్ద హీరోగా ఎదిగిపోయాడు. అలాంటి హీరోతో సినిమా చేసే అవకాశం అంటే ఏ దర్శకుడైనా వదులుకుంటాడా?
కానీ విజయ్ కోరుకున్నట్లుగా స్క్రిప్టును మార్చి, ఆయన చెప్పిన టైంలైన్లో సినిమా చేయలేని పరిస్థితుల్లో తాను ఆ అవకాశం వదులుకున్నట్లు చెబుతున్నాడు ఆర్జే బాలాజీ. తమిళంలో రేడియో జాకీగా పాపులరిటీ సంపాదించి.. ఆ తర్వాత నటుడిగా మారిన బాలాజీ.. కొన్నేళ్ల కిందట ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం సక్సెస్ అయింది. తర్వాత అతను విజయ్ కోసం ఒక కథ రెడీ చేశాడట.
2023లో విజయ్ని కలిసి ఆ కథ చెబితే.. అతడికీ నచ్చిందట. ఈ కథను ఇంకొంచెం వినోదాత్మకంగా మార్చమని అడిగాడట విజయ్. అంతేకాక రాజకీయాల్లోకి వెళ్లే ముందు తనకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో చకచకా ఆ ప్రాజెక్టును చేసేద్దామని కూడా చెప్పాడట. కానీ తాను విజయ్ కోరుకున్నంత వేగంగా సినిమా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయానని బాలాజీ తెలిపాడు.
ఐతే విజయ్తో కలిసి కథా చర్చలు జరిపిన సమయంలో కథలో ఇంకొన్ని మంచి మార్పులు జరిగాయని.. తర్వాత ఈ స్క్రిప్టునే తీసుకెళ్లి సూర్యకు చెబితే ఆయన వెంటనే ఓకే చేశాడని తెలిపాడు. ఆ చిత్రమే ‘కరుప్పు’ అని బాలాజీ వెల్లడించాడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ‘కరుప్పు’ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.
వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ‘మూకుత్తి అమ్మన్’ సీక్వెల్కు తాను కాకుండా సుందర్ దర్శకత్వం వహిస్తుండడం గురించి బాలాజీ స్పందిస్తూ.. తనకు ఆ మూవీకి సీక్వెల్ చేసే ఉద్దేశం లేదని, కానీ నిర్మాతలు సుందర్ దర్శకత్వంలో సీక్వెల్ చేయాలనుకుని తనకు చెబితే.. సరే అన్నానని చెప్పాడు.
This post was last modified on March 22, 2026 8:27 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…