Trends

వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్‌లైన్ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధిక స్క్రీన్ టైమ్ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యమన్నారు. దీంతో దేశంలో పిల్లలపై సోషల్ మీడియా వినియోగానికి నిషేధం ప్రకటించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా ఆలోచిస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించామని తెలిపారు. దీనిని 90 రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే 16 ఏళ్లలోపు పిల్లలపైనా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ గతంలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసే అంశంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఉండకూడదని, వారు పంచుకునే సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మొత్తం మీద సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇరు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

This post was last modified on March 6, 2026 3:18 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Social Media

Recent Posts

బీఆర్ ఎస్ ఎందుకు వెన‌క్కి త‌గ్గింది?!

తెలంగాణ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ కాంగ్రెస్ త‌ర‌ఫున ఇద్ద‌రు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే ఎంపీగా ఉన్న జాతీయ…

11 minutes ago

‘ఉస్తాద్’ తప్పు దిద్దుకున్న బుక్ మై షో

ఒక బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.…

2 hours ago

ఎట్టకేలకు నిద్ర లేచిన దురంధర్

మార్చి నెలలో వస్తాయనుకున్న కొన్ని క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడిపోయాయి. చివరి వారానికి…

2 hours ago

చైతూ విలన్… బాలీవుడ్ సందీప్ వంగ!

కొందరు సినీ ప్రముఖులు మాట్లాడుతుంటే అందరూ అలెర్ట్ అవుతారు. వాళ్ల మాటతీరు భయం గొల్పేలా ఉంటుంది. ఎప్పుడూ ఫైర్ మీద…

2 hours ago

సభకు బొత్స… లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇటీవల అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి హాజరయ్యారు. ఈ…

2 hours ago

తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల చిచ్చు!

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగా పరకాల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో…

4 hours ago