Trends

కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలోని హోరును ఆపి, అక్కడి ప్రేక్షకులను మౌనంగా ఉండేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రౌండ్‌లో నిశ్శబ్దం నెలకొంటే, తాము మ్యాచ్ గెలుస్తున్నామని అర్థమని ఆయన చెప్పుకొచ్చారు.

కరన్ మాటలు వింటుంటే 2023లో పాట్ కమిన్స్ చేసిన హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి. అహ్మదాబాద్ ఫైనల్లో భారతీయులను సైలెంట్ చేస్తానని కమిన్స్ అన్నట్లుగానే చేసి చూపించాడు. అభిమానులకు ఇప్పటికి అదొక మాయని గాయం. ఇప్పుడు కరన్ కూడా అదే తరహాలో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు.

ముంబై ఫ్యాన్స్ ఇచ్చే మద్దతును ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఐపీఎల్ అనుభవం తమకు ఇక్కడ బాగా పనికొస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడిని అధిగమించి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఈ రెండు జట్లు తలపడటం ఇది మూడోసారి. గతంలో ఒకసారి ఇంగ్లాండ్, మరోసారి భారత్ గెలిచి సమంగా ఉన్నాయి. అయితే ఈసారి గెలుపు కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమని సామ్ కరన్ చెబుతున్నారు. తనకు ఆట పర్ఫెక్ట్‌గా ఉండటం కంటే, ఏ రకంగానైనా ఫైనల్ చేరడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. గత కొన్ని వారాలుగా పడుతున్న శ్రమకు ఈ విజయం దక్కాలని ఆశిస్తున్నారు.

వాంఖడే స్టేడియం పరిమాణంలో చిన్నదైనా, అక్కడ ఫ్యాన్స్ చేసే సౌండ్ గట్టిగా ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు ఈ మద్దతు పెద్ద బలంగా మారనుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం వల్ల మన ప్లేయర్లకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఇంగ్లాండ్ ప్లేయర్లు కేవలం మాటలకే పరిమితం అవుతారా లేక మైదానంలో కూడా సత్తా చాటుతారా అనేది చూడాలి.

This post was last modified on March 4, 2026 4:50 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

37 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

7 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago