Trends

కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలోని హోరును ఆపి, అక్కడి ప్రేక్షకులను మౌనంగా ఉండేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రౌండ్‌లో నిశ్శబ్దం నెలకొంటే, తాము మ్యాచ్ గెలుస్తున్నామని అర్థమని ఆయన చెప్పుకొచ్చారు.

కరన్ మాటలు వింటుంటే 2023లో పాట్ కమిన్స్ చేసిన హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి. అహ్మదాబాద్ ఫైనల్లో భారతీయులను సైలెంట్ చేస్తానని కమిన్స్ అన్నట్లుగానే చేసి చూపించాడు. అభిమానులకు ఇప్పటికి అదొక మాయని గాయం. ఇప్పుడు కరన్ కూడా అదే తరహాలో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు.

ముంబై ఫ్యాన్స్ ఇచ్చే మద్దతును ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఐపీఎల్ అనుభవం తమకు ఇక్కడ బాగా పనికొస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడిని అధిగమించి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఈ రెండు జట్లు తలపడటం ఇది మూడోసారి. గతంలో ఒకసారి ఇంగ్లాండ్, మరోసారి భారత్ గెలిచి సమంగా ఉన్నాయి. అయితే ఈసారి గెలుపు కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమని సామ్ కరన్ చెబుతున్నారు. తనకు ఆట పర్ఫెక్ట్‌గా ఉండటం కంటే, ఏ రకంగానైనా ఫైనల్ చేరడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. గత కొన్ని వారాలుగా పడుతున్న శ్రమకు ఈ విజయం దక్కాలని ఆశిస్తున్నారు.

వాంఖడే స్టేడియం పరిమాణంలో చిన్నదైనా, అక్కడ ఫ్యాన్స్ చేసే సౌండ్ గట్టిగా ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు ఈ మద్దతు పెద్ద బలంగా మారనుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం వల్ల మన ప్లేయర్లకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఇంగ్లాండ్ ప్లేయర్లు కేవలం మాటలకే పరిమితం అవుతారా లేక మైదానంలో కూడా సత్తా చాటుతారా అనేది చూడాలి.

This post was last modified on March 4, 2026 4:50 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

40 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago