ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు. ఒకేసారి ఎన్నో లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి అంటారు. కానీ అసలు పరీక్ష యుద్ధభూమిలో పడితే మాత్రం కథ వేరేలా మారుతోంది.
ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు పెద్దగా పనిచేయలేదనే వార్తలు వచ్చాయి. ఇరాన్ భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన ఈ సిస్టమ్స్ కొన్ని గంటల్లోనే నిర్వీర్యమయ్యాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారీ నష్టం జరిగిందని సమాచారం.
ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా పాకిస్థాన్, వెనెజువెలా వంటి దేశాల్లో చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ప్రచారంలో మాత్రం అవి అమెరికా పేట్రియట్, రష్యా ఎస్ 300లకు సమానమని చెప్పినా, ఫీల్డ్ లో మాత్రం ఫలితం ఆశించినంతగా కనిపించలేదని విశ్లేషకులు అంటున్నారు.
చైనా తయారీ ఆయుధాల గురించి ఒక వ్యంగ్య వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రోచర్ లో చూసే వరకు ఇవి అద్భుతం. యుద్ధంలో చూసే సరికి మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇలాంటి అంశాలు పూర్తిగా సాంకేతిక విషయాలు కూడా కావచ్చు. యుద్ధంలో విజయం లేదా వైఫల్యం అనేది ఒక్క ఆయుధంపై మాత్రమే ఆధారపడదు. వ్యూహం, శిక్షణ, సమన్వయం అన్నీ కీలకం. కానీ వరుసగా ఇలాంటి వార్తలు రావడం మాత్రం చైనా రక్షణ సామగ్రిపై అనుమానాలు పెంచుతోంది.
This post was last modified on March 3, 2026 11:50 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…