ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు. ఒకేసారి ఎన్నో లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి అంటారు. కానీ అసలు పరీక్ష యుద్ధభూమిలో పడితే మాత్రం కథ వేరేలా మారుతోంది.
ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు పెద్దగా పనిచేయలేదనే వార్తలు వచ్చాయి. ఇరాన్ భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన ఈ సిస్టమ్స్ కొన్ని గంటల్లోనే నిర్వీర్యమయ్యాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారీ నష్టం జరిగిందని సమాచారం.
ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా పాకిస్థాన్, వెనెజువెలా వంటి దేశాల్లో చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ప్రచారంలో మాత్రం అవి అమెరికా పేట్రియట్, రష్యా ఎస్ 300లకు సమానమని చెప్పినా, ఫీల్డ్ లో మాత్రం ఫలితం ఆశించినంతగా కనిపించలేదని విశ్లేషకులు అంటున్నారు.
చైనా తయారీ ఆయుధాల గురించి ఒక వ్యంగ్య వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రోచర్ లో చూసే వరకు ఇవి అద్భుతం. యుద్ధంలో చూసే సరికి మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇలాంటి అంశాలు పూర్తిగా సాంకేతిక విషయాలు కూడా కావచ్చు. యుద్ధంలో విజయం లేదా వైఫల్యం అనేది ఒక్క ఆయుధంపై మాత్రమే ఆధారపడదు. వ్యూహం, శిక్షణ, సమన్వయం అన్నీ కీలకం. కానీ వరుసగా ఇలాంటి వార్తలు రావడం మాత్రం చైనా రక్షణ సామగ్రిపై అనుమానాలు పెంచుతోంది.
This post was last modified on March 3, 2026 11:50 pm
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…