ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు. ఒకేసారి ఎన్నో లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి అంటారు. కానీ అసలు పరీక్ష యుద్ధభూమిలో పడితే మాత్రం కథ వేరేలా మారుతోంది.
ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు పెద్దగా పనిచేయలేదనే వార్తలు వచ్చాయి. ఇరాన్ భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన ఈ సిస్టమ్స్ కొన్ని గంటల్లోనే నిర్వీర్యమయ్యాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారీ నష్టం జరిగిందని సమాచారం.
ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా పాకిస్థాన్, వెనెజువెలా వంటి దేశాల్లో చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ప్రచారంలో మాత్రం అవి అమెరికా పేట్రియట్, రష్యా ఎస్ 300లకు సమానమని చెప్పినా, ఫీల్డ్ లో మాత్రం ఫలితం ఆశించినంతగా కనిపించలేదని విశ్లేషకులు అంటున్నారు.
చైనా తయారీ ఆయుధాల గురించి ఒక వ్యంగ్య వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రోచర్ లో చూసే వరకు ఇవి అద్భుతం. యుద్ధంలో చూసే సరికి మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇలాంటి అంశాలు పూర్తిగా సాంకేతిక విషయాలు కూడా కావచ్చు. యుద్ధంలో విజయం లేదా వైఫల్యం అనేది ఒక్క ఆయుధంపై మాత్రమే ఆధారపడదు. వ్యూహం, శిక్షణ, సమన్వయం అన్నీ కీలకం. కానీ వరుసగా ఇలాంటి వార్తలు రావడం మాత్రం చైనా రక్షణ సామగ్రిపై అనుమానాలు పెంచుతోంది.
This post was last modified on March 3, 2026 11:50 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఖాళీ…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో స్థానిక సీబీఐ కోర్టు…
ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు…
ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి…
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…