తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఖాళీ అవుతున్న సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ సభ్యుడు సురేష్రెడ్డిది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ తరపునే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన పదవీ కాలం కూడా.. ఈ ఏడాది జూన్ 16తో ముగియనుంది. అయితే.. ఈ సీటును తిరిగి ఆయనకే ఇవ్వనున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రానికి సమాచారం అందించింది.
ఇక, మిగిలిన ఒకే ఒక్కసీటు కోసం భారీ సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. అయితే.. వీరిని సిఫారసు చేస్తున్న పెద్దల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఒక సీటునుకోరుకుంటున్న నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టే.. వీరిని సిఫారసు చేస్తున్న లేదా వెనుకేసుకు వస్తున్న పెద్ద నాయకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతున్నా.. ఇప్పటి వరకు ఈ ఒక్కసీటుకు ఎవరు పోటీ చేస్తారన్నది తెలియకపోవడం.. పోటీ తీవ్రంగా ఉండడం గమనార్హం.
ఎవరు ఎవరిని సిఫారసు చేస్తున్నారు?
+ సీఎం రేవంత్ రెడ్డి… వేం నరేందర్రెడ్డిని సిఫారసు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
+ వీ. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్లలో ఎవరికైనా అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.
+ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. వంశీచంద్రెడ్డిని ఎంపిక చేయాలని కోరుతున్నారట.
+ గతంలోనే తనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారని వినయ్కుమార్ కోరుతున్నారు. ఈయనను కొందరు సీనియర్లు సిఫార్సు చేస్తున్నారు.
+ ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి కూడా కేంద్ర స్థాయి పెద్దలతో టచ్లో ఉన్నారని తెలిసింది. తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని.. సో.. ఇప్పుడు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
+ మరోవైపు.. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తరఫున కొందరు ఏఐసీసీకి ఇప్పటికే సిఫారసు చేశారని అంటున్నారు. మొత్తంగా.. ఒక్క సీటు కోసం కాంగ్రెస్లో పెద్ద నేతలే అటు – ఇటు అన్నట్టుగా చీలిపోవడం గమనార్హం. మరి చివరకు ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
This post was last modified on March 3, 2026 7:29 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…