తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఖాళీ అవుతున్న సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ సభ్యుడు సురేష్రెడ్డిది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ తరపునే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన పదవీ కాలం కూడా.. ఈ ఏడాది జూన్ 16తో ముగియనుంది. అయితే.. ఈ సీటును తిరిగి ఆయనకే ఇవ్వనున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రానికి సమాచారం అందించింది.
ఇక, మిగిలిన ఒకే ఒక్కసీటు కోసం భారీ సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. అయితే.. వీరిని సిఫారసు చేస్తున్న పెద్దల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఒక సీటునుకోరుకుంటున్న నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టే.. వీరిని సిఫారసు చేస్తున్న లేదా వెనుకేసుకు వస్తున్న పెద్ద నాయకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతున్నా.. ఇప్పటి వరకు ఈ ఒక్కసీటుకు ఎవరు పోటీ చేస్తారన్నది తెలియకపోవడం.. పోటీ తీవ్రంగా ఉండడం గమనార్హం.
ఎవరు ఎవరిని సిఫారసు చేస్తున్నారు?
+ సీఎం రేవంత్ రెడ్డి… వేం నరేందర్రెడ్డిని సిఫారసు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
+ వీ. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్లలో ఎవరికైనా అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.
+ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. వంశీచంద్రెడ్డిని ఎంపిక చేయాలని కోరుతున్నారట.
+ గతంలోనే తనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారని వినయ్కుమార్ కోరుతున్నారు. ఈయనను కొందరు సీనియర్లు సిఫార్సు చేస్తున్నారు.
+ ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి కూడా కేంద్ర స్థాయి పెద్దలతో టచ్లో ఉన్నారని తెలిసింది. తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని.. సో.. ఇప్పుడు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
+ మరోవైపు.. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తరఫున కొందరు ఏఐసీసీకి ఇప్పటికే సిఫారసు చేశారని అంటున్నారు. మొత్తంగా.. ఒక్క సీటు కోసం కాంగ్రెస్లో పెద్ద నేతలే అటు – ఇటు అన్నట్టుగా చీలిపోవడం గమనార్హం. మరి చివరకు ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
This post was last modified on March 3, 2026 7:29 pm
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో స్థానిక సీబీఐ కోర్టు…
ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు…
ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి…
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…