Trends

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని డ్రాఫ్ట్ నియమాల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఫిబ్రవరి 20, 2026న అసెంబ్లీలో ప్రకటించారు.

డ్రాఫ్ట్ ప్రకారం, వధూవరులు దరఖాస్తులో తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలి. దరఖాస్తు అందుకున్న 10 పని రోజులలోగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇరువురి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా అధికారిక సమాచారం అందజేయాలి. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 30 రోజుల ధృవీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే వివాహ నమోదు ధ్రువపత్రం జారీ చేయనున్నారు. అలాగే పెళ్లి ఫొటోలు, వీడియోలు, సాక్షుల వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

“లవ్ జిహాద్” పేరుతో జరిగే మోసాలు, రహస్య వివాహాలను అరికట్టడం, కుటుంబ వ్యవస్థను కాపాడడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రేమ వివాహాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ మోసపూరిత ఘటనలను నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి 30 రోజుల పాటు అభిప్రాయాలు సేకరించనున్నారు. బీజేపీ నాయకులు ఈ మార్పులను సమర్థిస్తూ కుటుంబాలకు రక్షణ కల్పించే చర్యగా అభివర్ణిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సహా కొందరు ప్రతిపక్ష నాయకులు, న్యాయ నిపుణులు ఈ నిబంధనలు పెద్దల గోప్యతా హక్కులను ఉల్లంఘించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on February 22, 2026 2:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ముందే తెలిసినా లాభం లేదు రాశీ

గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…

26 minutes ago

దురంధర్ దూకుడు… సరిపోని ఉస్తాద్ చప్పుడు

బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…

2 hours ago

డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు…

3 hours ago

అక్క‌డ‌ `జ‌న‌సేన‌` ఉడుంప‌ట్టు

గిరిజ‌న ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్…

4 hours ago

మ‌ల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి మ‌రో లీడ‌ర్‌..?

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాటల తూటాల‌ను త‌న‌దైన శైలిలో ఎటైనా తిప్ప‌గ‌ల నేర్ప‌రిగా పేరొందిన‌ నేత‌.. అన్నింటికీ మించి `అంద‌రివాడు`గా గుర్తింపు…

5 hours ago

భవిష్యత్తుని శాసించబోతున్న డాల్బీ సినిమా

వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…

10 hours ago